News September 21, 2024
MBNR: UPDATE.. ఓటర్ల వివరాలు ఇలా.!

మహబూబ్ నగర్ జిల్లాలో 441 గ్రామ పంచాయతీల్లో 3,838 వార్డులు ఉన్నాయి. ఇప్పటికే ఈనెల 28న తుది జాబితా విడుదల చేసేందుకు అధికారులు గ్రామాల్లో, పట్టణాల్లో కసరత్తులు చేపట్టారు. ఈ నెల 13న ఓటర్ జాబితా ముసాయిదాను విడుదల చేయగా.. దాని ప్రకారం 5,16,062 మంది ఓటర్లు ఉన్నారు. 2,57,477 మంది పురుషులు, 2,58,578 మంది మహిళలు, ఏడుగురు ఇతరులు ఉన్నారు. పురుష ఓటర్లతో పోలిస్తే 1,101 మంది మహిళల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి.
Similar News
News November 28, 2025
MBNR: జీపీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్

రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ విజయేందిర బోయి అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ… ఎన్నిసార్లు ఎన్నికలు నిర్వహించినా ప్రతిసారీ సవాళ్లు ఎదురవుతాయని, అందువల్ల అధికారులు తప్పనిసరిగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News November 28, 2025
MBNR: కొనసాగుతున్న చలి తీవ్రత

మహబూబ్ నగర్ జిల్లాల్లో చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది. జిల్లాలో అత్యల్పంగా మిడ్జిల్ మండలం దోనూరులో 13.2 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదయింది. బాలానగర్ 14.1, రాజాపూర్ 14.4, మిడ్జిల్ మండలం కొత్తపల్లి, భూత్పూర్ 14.9, కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 15.0, హన్వాడ 15.1, మిడ్జిల్ 15.2, మూసాపేట 15.5, మహమ్మదాబాద్ 15.7, భూత్పూర్ మండలం కొత్త మొల్గర 15.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
News November 27, 2025
MBNR: ఎన్నికల ఏర్పాట్లపై ఎస్పీ సమీక్ష

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ డి.జానకి ఎన్నికల సాధారణ పరిశీలకురాలు కాత్యాయిని దేవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల ఏర్పాట్లు, భద్రతా చర్యలను ఆమె వివరించారు. అనంతరం ఎస్పీ జానకి అల్లిపూర్ గ్రామ పంచాయతీ నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి అక్కడ భద్రతా బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించారు.


