News June 23, 2024

MBNR: ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో కొత్త కోర్సులు

image

మహబూబ్‌నగర్‌లోని ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో ఈ విద్యాసంవత్సరంలో ప్రభుత్వం కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చిందని ప్రిన్సిపల్ పద్మావతి తెలిపారు. ఈమేరకు కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. BAHP, BSC ఫార్మాసేల్స్, మార్కెటింగ్, BCOM ఫైనాన్స్, BBA రీటెయిల్ ఆపరేషన్స్ వంటి ఒక్కో కోర్సుల్లో 60 సీట్ల ఉన్నాయన్నారు. ఎంవీఎస్ కళాశాలలో పూర్తి స్థాయిలో వసతులు, సిబ్బంది ఉన్నారని తెలిపారు.

Similar News

News October 8, 2024

నాగర్‌కర్నూల్: విషాదం.. కరెంట్ షాక్‌తో బాలుడి మృతి

image

నాగర్ కర్నూల్ జిల్లా లింగాలలో తీవ్ర విషాదం నెలకొంది. విద్యుత్ షాక్‌కు గురై బాలుడు మృతిచెందాడు. స్థానికుల వివరాలు మేరకు.. లింగాలకు చెందిన అశోక్, శిరీష దంపతుల కొడుకు అభిరామ్(11 నెలలు). సోమవారం సాయంత్రం బాబు ఆడుకుంటుండగా ఇంట్లో ఉన్న బెడ్ లైట్ వైర్ తగిలి తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. వెంటనే లింగాల ఆస్పత్రికి తీసుకెళ్లాడు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి అచ్చంపేటకు వెళ్తుండగా మార్గం మధ్యలో మృతి చెందారు.

News October 7, 2024

గద్వాల: నవజాత శిశువు మృతి.. ఆసుపత్రి వద్ద ఆందోళన

image

గద్వాల జిల్లా మల్దకల్ మండలం ఎల్కూరు నాగరాణికి పురిటి నొప్పులు రాగా గద్వాలలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో సోమవారం అడ్మిట్ చేశారు. కాన్పు చేసే సమయంలో నవజాత శిశువు కడుపులో మృతి చెందింది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా శిశువు మృతి చెందిందని నాగరాణి కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.

News October 7, 2024

ఉమ్మడి జిల్లా నేటి ఉష్ణోగ్రత వివరాలు

image

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా సోమవారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా చెన్నపురావుపల్లిలో 35.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. వనపర్తి జిల్లా విలియంకొండలో 34.8 డిగ్రీలు, మహబూబ్నగర్ జిల్లా నవాబుపేటలో 34.5 డిగ్రీలు, గద్వాల జిల్లా రాజోలిలో 33.1 డిగ్రీలు, నారాయణపేట జిల్లా కేంద్రంలో 31.7 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.