News April 4, 2025

MBNR: కులవృత్తులు నిర్వీర్యమయ్యాయి: మాజీ మంత్రి

image

నేతన్నల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పట్టణ కేంద్రంలో చేనేత కార్మికుల గృహాలను సందర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కులవృత్తులు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయన్నారు. చేనేత కార్మికులకు విద్యుత్ బిల్లులు పెనుశాపంగా మారాయని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో చేనేత కార్మికులను ఆదుకున్నామన్నారు.

Similar News

News April 18, 2025

IPL: RCBకి బిగ్ షాక్

image

పంజాబ్‌తో మ్యాచులో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన RCB కష్టాల్లో పడింది. 6.1 ఓవర్లలో 33 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయింది. సాల్ట్ 4, కోహ్లీ 1, లివింగ్‌స్టోన్ 4, జితేశ్ 2, కృణాల్ ఒక పరుగుకే పెవిలియన్ చేరారు. వర్షం కారణంగా పిచ్ బౌలింగ్‌కు అనుకూలిస్తోంది. మ్యాచును 14 ఓవర్లకు కుదించిన విషయం తెలిసిందే. PBKS బౌలర్లలో అర్ష్‌దీప్ 2, బార్ట్‌లెట్, చాహల్, జాన్‌సెన్ తలో వికెట్ తీశారు.

News April 18, 2025

60 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న బీజేపీ నేత

image

బెంగాల్ BJP రాష్ట్ర మాజీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్(60) పార్టీ కార్యకర్త రింకూ ముజుందార్(51)ను పెళ్లాడారు. ఇప్పటివరకు బ్రహ్మచారిగానే ఉన్న అతను తన తల్లి చివరి కోరిక మేరకు వివాహం చేసుకున్నట్లు తెలిపారు. రింకూకు ఇది రెండో వివాహం కాగా ఓ కుమారుడు కూడా ఉన్నారు. మార్నింగ్ వాక్ సందర్భంగా 2021లో వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఇటీవల ఈడెన్ గార్డెన్స్‌లో IPL మ్యాచ్ చూడటానికి వెళ్లి పెళ్లిపై నిర్ణయం తీసుకున్నారు.

News April 18, 2025

గంటాను కలిసిన దేవీశ్రీ ప్రసాద్

image

భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును ప్రముఖ సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ శుక్రవారం ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. పోర్టు స్టేడియంలో శనివారం రాత్రి జరగనున్న సంగీత విభావరి కోసం దేవీశ్రీ ప్రసాద్ విశాఖ వచ్చారు. సినీ సంగీత కార్యక్రమాలను నగర ప్రజలు ఎప్పుడూ ఆదరిస్తారని, ఈ విభావరి కూడా విజయవంతం కావాలని గంటా ఆకాంక్షించారు. తన కొత్త ప్రాజెక్టుల వివరాలను దేవీశ్రీ ప్రసాద్ గంటాతో పంచుకున్నారు. 

error: Content is protected !!