News July 15, 2024
MBNR: దోస్త్ మూడు దశల్లో చేరింది 9,709 మందే
పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో సీట్లు భర్తీ చేసేందుకు ప్రభుత్వం దోస్త్ ద్వారా అడ్మిషన్ల చేపట్టింది. ఇప్పటికి మూడు దశల్లో అడ్మిషన్లు చేపట్టగా.. ఉమ్మడి జిల్లాలోని 93 కళాశాలల్లో 31 వేల సీట్లు ఉండగా కేవలం 9,709 మంది విద్యార్థులు మాత్రమే చేరినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వం కొత్తగా ఆరు డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసింది.
Similar News
News October 2, 2024
పాన్గల్: క్షుద్ర పూజలు కలకలం.. గ్రామస్థుల్లో టెన్షన్..
పాన్గల్ మండలం కేతేపల్లి గ్రామంలోని గుండ్ల చెరువుకు వెళ్లే దారిలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. మంగళవారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు పసుపు, కుంకుమ, తెల్లని పిండితో మనిషిని పోలిన బొమ్మను గీశారని గ్రామస్థులు తెలిపారు. దారి నుంచి పంట పొలాలకు వెళ్లేందుకు రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. రాతియుగం నుంచి రాకెట్ యుగం వచ్చినా ఇలాంటి క్షుద్రపూజలు ఏంటని పలువురు అంటున్నారు.
News October 2, 2024
నాగర్ కర్నూల్ను నాశనంచేస్తున్న తండ్రి, కొడుకు:మర్రి జనార్దన్ రెడ్డి
సగం తెలిసిన MLC, అనుభవం లేని MLA నాగర్ కర్నూల్ నియోజకవర్గాన్ని నాశనం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. MLC దామోదర్ రెడ్డి, MLA రాజేష్ రెడ్డిలను ఉద్దేశించి విమర్శించారు. ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. అవినీతిపై ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేయిస్తున్నారని అన్నారు. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చి తనకంటే ఎక్కువ అభివృద్ధి చేసి చూపించాలని మాజీ ఎమ్మెల్యే వారికి సవాల్ విసిరారు.
News October 1, 2024
NGKL: డీఎస్సీ ఫలితాల్లో రెండు జిల్లాల్లో డిస్ట్రిక్ టాపర్
నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లిలోని నిరుపేద కుటుంబానికి చెందిన కే. స్వప్న తాజా డీఎస్సీ ఫలితాల్లో సత్తా చాటింది. SGT తెలుగులో 84.90 మార్కులు సాధించి నాగర్ కర్నూల్ జిల్లా స్థాయిలో 1st ర్యాంక్ సాధించింది. అలాగే SGT ఇంగ్లిష్లో 87.90 మార్కులు సాధించి హైదరాబాద్ జిల్లా స్థాయిలో 1st ర్యాంక్ సాధించింది. ఫలితాల్లో స్వప్న సత్తా చాటడంతో సన్నిహితులు గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.