News July 21, 2024
MBNR: నవోదయ ప్రవేశాలకు దరఖాస్తులు
బిజినేపల్లి మండలం వట్టెంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2025-26వ సంవత్సరానికి గాను 6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు విద్యాలయ ప్రిన్సిపల్ భాస్కర్ కుమార్ తెలిపారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. సెప్టెంబర్ 16 వరకు దరఖాస్తు చేసుకోవాలని, ప్రవేశ పరీక్ష 18, జనవరి, 2025న నిర్వహిస్తామని తెలిపారు.
Similar News
News October 2, 2024
ఉమ్మడి MBNR జిల్లా ప్రత్యేక అధికారిగా రవి
తెలంగాణలోని10 ఉమ్మడి జిల్లాలకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా(MBNR, NRPT, WNP, NGKL, GDWL) ప్రత్యేక అధికారిగా కాలుష్య నివారణ బోర్డు సెక్రటరీ రవి ఐఏఎస్ను నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు ఆయా జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకొని ముందుకెళ్లాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఆదేశించారు.
News October 2, 2024
పాన్గల్: క్షుద్ర పూజలు కలకలం.. గ్రామస్థుల్లో టెన్షన్..
పాన్గల్ మండలం కేతేపల్లి గ్రామంలోని గుండ్ల చెరువుకు వెళ్లే దారిలో క్షుద్ర పూజలు కలకలం రేపాయి. మంగళవారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు పసుపు, కుంకుమ, తెల్లని పిండితో మనిషిని పోలిన బొమ్మను గీశారని గ్రామస్థులు తెలిపారు. దారి నుంచి పంట పొలాలకు వెళ్లేందుకు రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారన్నారు. రాతియుగం నుంచి రాకెట్ యుగం వచ్చినా ఇలాంటి క్షుద్రపూజలు ఏంటని పలువురు అంటున్నారు.
News October 2, 2024
నాగర్ కర్నూల్ను నాశనంచేస్తున్న తండ్రి, కొడుకు:మర్రి జనార్దన్ రెడ్డి
సగం తెలిసిన MLC, అనుభవం లేని MLA నాగర్ కర్నూల్ నియోజకవర్గాన్ని నాశనం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. MLC దామోదర్ రెడ్డి, MLA రాజేష్ రెడ్డిలను ఉద్దేశించి విమర్శించారు. ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. అవినీతిపై ప్రశ్నిస్తే అక్రమ అరెస్టులు చేయిస్తున్నారని అన్నారు. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చి తనకంటే ఎక్కువ అభివృద్ధి చేసి చూపించాలని మాజీ ఎమ్మెల్యే వారికి సవాల్ విసిరారు.