News April 18, 2024
MBNR: నేడు MVS కళాశాలలో జాబ్ మేళా

క్రిస్టియనపల్లిలో ఎంవీఎస్ ప్రభుత్వ కళాశాలలో నేడు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ పద్మావతి తెలిపారు.HYD మ్యూజిక్ బస్ ఫౌండేషన్,MVS కళాశాల సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మేళాకు మెడ్ ప్లస్, అపోలో,క్రోబాన్ ఐసీఐసీఐ బ్యాంక్,వీఎన్ ఫెర్టిలైజర్స్,స్పందన స్ఫూర్తి,ముత్తూట్ ఫైనాన్స్ తదితర అనేక కంపెనీల ప్రతినిధులు,హెచ్వీడీలు హాజరవుతారని తెలిపారు. ప్రతి ఒక్కరు తమ బయోడేటా ఫార్మ్స్ తో హాజరు కావాలన్నారు.
Similar News
News April 23, 2025
బాలానగర్: ‘8 K.M నడిచి.. 434 మార్కులు సాధించిన గిరి పుత్రిక’

బాలానగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీ విభాగంలో హేమలత.. 434/440 మార్కులు సాధించింది. తల్లిదండ్రులు నిరుపేదలు. వ్యవసాయం జీవనం సాగిస్తున్నారు. హేమలత ప్రతిరోజు.. కళాశాలకు ఉదయం 4 కి.మీ, సాయంత్రం 4.K.M నడుస్తూ.. కళాశాలకు వచ్చి చదువుకొని అత్యధిక మార్కులు సాధించడంతో కళాశాల ప్రిన్సిపల్ రమేష్ లింగం, కళాశాల యాజమాన్యం సంతోషం వ్యక్తం చేశారు.
News April 23, 2025
బీజేపీ నేత హత్యకు కుట్ర: MBNR ఎంపీ అరుణ

దేవరకద్ర బీజేపీ నేత కొండ ప్రశాంత్ రెడ్డి హత్యకు కుట్రలు జరుగుతున్నాయని ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. ఇవాళ ఆమె ప్రశాంత్ రెడ్డితో కలిసి డీజీపీకి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గత కొన్ని రోజులుగా ప్రశాంత్ రెడ్డి హత్యకు కుట్రలు జరుగుతున్నాయి అన్నారు. రూ.2కోట్ల 50లక్షలు సుపారి ఇచ్చి హత్యకు కుట్రచేసినట్లు డీకే అరుణ అనుమానం వ్యక్తంచేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఆమె డీజీపీని కోరారు.
News April 23, 2025
MBNR: అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి

వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి కొరత రాకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశించారు. కలెక్టర్ విజయేంద్రబోయి అధ్యక్షతన జరిగిన సమీక్షలో మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి ఆదేశించారు.