News October 11, 2024
MBNR : ప్రారంభంలో పత్తి ధర అదుర్స్.. తర్వాత డమాల్ !
ఉమ్మడి పాలమూరు జిల్లాలో వివిధ పంటల సాగులో పత్తిదే అగ్రస్థానం. ఉమ్మడి జిల్లాల్లో 9.50 లక్షల ఎకరాల వరకు రైతులు పత్తి సాగు చేశారు. ప్రస్తుతం ధర రూ.6 వేలు నుంచి రూ.6,500 వరకు పలుకుతుంది. పత్తి ధర ప్రారంభంలో రూ.8,100 ధర ఉండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. తాజాగా పడిపోతున్న ధరలను చూసి రైతులు అమ్మకాలు జరపకుండా ఇంట్లో నిల్వ ఉంటుకుంటున్నారు. ప్రభుత్వం పత్తి ధరను పెంచాలని కోరుతున్నారు.
Similar News
News October 11, 2024
వనపర్తి: స్వీపర్ కూతురు టీచర్..!
వనపర్తి జిల్లా పాన్గల్ మండలం మాధవరావుపల్లి గ్రామానికి చెందిన మండ్ల వెంకటయ్య ప్రభుత్వ స్కూల్లో స్వీపర్గా పనిచేస్తున్నాడు. ఆయన కూతురు వనిత డీఎస్సీ ఫలితాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ SGT జాబ్ సాధించింది. కాగా నాన్నకు తోడుగా స్వీపర్గా సాయం చేసేది. వనిత తల్లిదండ్రులు మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచే చదువులో ముందంజలో ఉంటూ ఉద్యోగాన్ని సాధించినట్లు తెలిపారు. ఉపాధ్యాయులు, గ్రామస్థులు ఆమెను అభినందించారు.
News October 11, 2024
ఉమ్మడి జిల్లాకు 7 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు మంజూరు
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం 7 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను మంజూరు చేసింది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తుంది. జడ్చర్ల, దేవరకద్ర, కొల్లాపూర్, అచ్చంపేట, నాగర్ కర్నూల్, కొడంగల్, కొందుర్గు పట్టణాల్లో పాఠశాలలను ఏర్పాటు చేయనున్నారు. పలు చోట్ల నిర్మాణానికి పూజలు చేస్తున్నారు.
News October 11, 2024
అమెరికా ఐమాక్స్ ట్రేడ్ షోలో నల్లమల పర్యాటకం స్టాల్స్
కొల్లాపూర్: అమెరికా ఐమాక్స్ ట్రేడ్ షోలో తెలంగాణ పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన పర్యటక స్టాల్స్ను పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. నల్లమల ప్రాంతంలోని పకృతి అందాలు, ఎత్తైన కొండల నుంచి జాలువారే జలపాతాల అందాలు, పర్యాటక ప్రదేశాలను, సోమశిల అమరగిరి కృష్ణానది పరివాహక పకృతి పర్యటకుల ఎంతగానో ఆకట్టుకుంటాయని, నల్లమలలో పర్యటించాలని అమెరికా పర్యాటకులను మంత్రి ఆహ్వానించారు.