News April 4, 2025

MBNR: రజతోత్సవ వేడుకల సమావేశంలో ఆర్ఎస్పీ

image

ఏప్రిల్ 27న వరంగల్‌లో జరగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో MBNR బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. వేడుకల సందర్భంగా తెలంగాణ చరిత్ర, తెలంగాణకు పొంచి ఉన్న ప్రమాదాలను చక్కగా, ఓపికగా కేసీఆర్ వివరించారన్నారు. భావితరాల భవిష్యత్తును కాపాడడానికి ఎంతటి త్యాగానికైనా వెనకాడరాదని దిశా నిర్దేశం చేశారన్నారు.

Similar News

News April 11, 2025

జాతీయస్థాయి పోటీల్లో మెరిసిన భద్రాద్రి విద్యార్థిని 

image

మాచిరాజు బాల సాహిత్య పీఠం ప్రతిష్టాత్మకంగా జాతీయ స్థాయిలో బాలల కథల పోటీ -2025 నిర్వహించారు. ఈ పోటీల్లో జూలూరుపాడు మండలం పాపకొల్లు జడ్పీ హైస్కూల్ 7వ తరగతి చదువుతున్న విద్యార్థిని భూక్య వర్షితకు ద్వితీయ బహుమతి లభించింది. జాతీయ స్థాయి పోటీల్లో వచ్చిన 541 కథల్లో వర్షిత రాసిన ‘జంక్ ఫుడ్ తింటే’ అనే కథ ద్వితీయ స్థానంలో నిలిచి జిల్లా పేరు మారు మోగేలా చేసింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అభినందించారు.

News April 11, 2025

రామ్ చరణ్ ‘పెద్ది’లో మరో సర్ప్రైజ్?

image

రామ్ చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ చూసి మెగా ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అయ్యారు. లాస్ట్ షాట్‌లో చెర్రీ సిక్స్ కొట్టిన స్టైల్ అదుర్స్ అంటూ ప్రశంసలు వెల్లువెత్తాయి. అయితే, మూవీలో క్రికెట్‌తో పాటు రెజ్లింగ్ సీన్స్ ఫ్యాన్స్‌కి సర్ప్రైజ్ ఇస్తాయని టాక్ నడుస్తోంది. ఇంతకు ముందు ఎప్పుడూ చేయని మేనరిజమ్స్, నటనతో చెర్రీ కట్టిపడేస్తారని అంటున్నారు. ఇప్పటికే 30శాతం షూటింగ్ పూర్తయిందని, కీలక ఫైట్స్ షూట్ చేశారని సమాచారం.

News April 11, 2025

నిర్మల్ జిల్లాలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

image

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన ఘటన గురువారం భైంసా మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. భైంసా పట్టణం గోపాల్‌నగర్‌కు చెందిన బోయిడోళ్ల రాజు (32) వానల్పాడ్ నుంచి నడుచుకుంటూ తిమ్మాపూర్ వైపు వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొంది. తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

error: Content is protected !!