News May 14, 2024
MBNR: సైలెంట్గా క్రాస్ ఓటింగ్.. అభ్యర్థుల్లో ఆందోళన
జనరల్ స్థానమైన MBNRతో పాటు ఎస్సీ రిజర్వ్ స్థానమైన NGKL పార్లమెంట్ పరిధిలోని దాదాపు అన్ని అసెంబ్లీ స్థానాల్లో “సైలెంట్” ఓటింగ్ కొనసాగినట్లు పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. MBNR నుంచి 31 మంది, NGKL 19 మంది బరిలో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో డీలాపడ్డ పార్టీకి చెందిన ఓట్లు రెండు నియోజకవర్గాల్లో వేరే పార్టీ అభ్యర్థికి క్రాస్ అయినట్లు చర్చ సాగుతోంది. క్రాస్ ఓటింగ్ ఎవరికి కలిసి వచ్చేనో చూడాలి.
Similar News
News September 29, 2024
MBNR: గణనాథుడి లడ్డూ కైవసం చేసుకున్న ముస్లిం సోదరుడు
అచ్చంపేట మండలం నడింపల్లిలో గణనాథుడి లడ్డూను ముస్లిం సోదరుడైన ఎండీ. మోదీన్ కైవసం చేసుకున్నారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. 21 రోజుల పాటు పూజలందుకున్న వినాయక లడ్డూను శనివారం రాత్రి నిర్వహించిన వేలం పాటలో రూ.40,116కు మోదీన్ సొంతం చేసుకున్నాడని తెలిపారు. అతని కుటుంబానికి ఆ గణనాథుని ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటాయని, వినాయకుడి కృపతో అష్ట ఐశ్వర్యాలు, సుఖఃసంతోషాలు కలగాలని కమిటీ తరఫున కోరుకోవడం జరిగిందన్నారు.
News September 29, 2024
సీఎం ఫోటోలు కాదు.. 6 గ్యారంటీలు అమలు చేయండి: నిరంజన్ రెడ్డి
ప్రతీ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో అక్టోబర్ 7లోపు పెట్టాలని ఆదేశాలు ఇచ్చారని, కానీ ప్రభుత్వం వచ్చి 10నెలలైనా 6 గ్యారంటీల అమలుకు మాత్రం ఆదేశాలు లేవని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఎద్దేవా చేశారు. 6 గ్యారంటీల అమలును పట్టించుకోని ప్రభుత్వం ఆగమేఘాల మీద సీఎం ఫోటో ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టేందుకు సిద్ధమవుతుందని విమర్శించారు. ఇదే తరహాలో 6 గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
News September 28, 2024
రైతుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి: మంత్రి జూపల్లి
పానగల్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సమావేశం ఉమ్మడి జిల్లా డిసిసిబి చైర్మన్ మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సింగల్ విండో డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.