News August 11, 2024
MCR: రూ.67,700 డబ్బును పోగొట్టుకున్న నర్సింగ్ ఆఫీసర్..
సైబర్ మోసగాళ్ల చేతుల్లో మాచారెడ్డి మండలంలోని కాకుల గుట్ట తండాకు చెందిన ఓ నర్సింగ్ ఆఫీసర్ భూక్య సంతోష్ మోసపోయాడు. బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నామని నమ్మించి, లింక్ పంపి దాని ద్వారా వివరాలు తీసుకొని అతని అకౌంట్లోని రూ.67,700 డబ్బును దోచేశారు. వెంటనే సంతోష్ షాక్కు గురై, వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి మోసాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మాచారెడ్డి పోలీసులను కోరారు.
Similar News
News February 6, 2025
నిజామాబాద్: సర్పంచ్ ఎన్నికలు.. గ్రామాల్లో సందడి!
నిజామాబాద్ జిల్లాలోని 33 మండలాల్లో సుమారు 588 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఫిబ్రవరి 15లోగా పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఇటీవల పలువురు ప్రభుత్వ పెద్దలు చెప్పడంతో గ్రామాల్లో సందడి నెలకొంది. ఎన్నికల బరిలో దిగేందుకు మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, నూతన అభ్యర్థులు సర్వం సిద్ధమవుతున్నారు. మీ గ్రామంలో పరిస్థితి ఎలా ఉందో కామెంట్ చేయండి.
News February 6, 2025
నిజామాబాద్: దొంగను పట్టుకున్న గన్మెన్కు సన్మానం
దొంగను పట్టుకున్న తన గన్మెన్ దేవరాజ్ను TPCC అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ఈరోజు సన్మానించారు. బీసీల కులగణన లెక్కలు తేలాయని, ఎస్సీల వర్గీకరణకు అసెంబ్లీ ఆమోదం లభించిందని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాంధీ భవన్లో సంబరాల్లో ఉంటే ఓ దొంగ ఏకంగా 8 సెల్ఫోన్లను కార్యకర్తల జేబుల్లోంచి ఎవరికీ తెలియకుండా కొట్టేశాడు. సెల్ఫోన్లు కొట్టేస్తున్న ఆ దొంగను దేవరాజ్ చాకచక్యంగా పట్టుకోవడంతో మహేశ్ సన్మానించారు.
News February 6, 2025
కామారెడ్డి: తీన్మార్ మల్లన్నను అరెస్టు చేయాలని తీర్మానం
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వెంటనే అరెస్టు చేయాలని కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం యాడారం గ్రామ రెడ్డి సంఘం ప్రతినిధులు తీర్మానం చేశారు. బీబీపేట మండలం యాడారం గ్రామంలో రెడ్డి కులస్థులు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రతినిధులు బాపురెడ్డి, నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. అగ్రవర్ణ కులాలపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.