News February 6, 2025

MDCL: అకౌంట్లలో రైతు భరోసా పడుతోంది: DAO

image

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా రైతు భరోసా పథకంలో భాగంగా ఇప్పటి వరకు 4825 మంచి రైతులకు సంబంధించి రూ.3.74 కోట్లు ట్రెజరీకి పంపగా, గ్రామసభలు జరిగిన తెల్లారి 2706 మంది రైతులకు రూ.3.13కోట్ల రైతుల భరోసా అకౌంట్లలో జమైందని DAO చంద్రకళ తెలిపారు. ఈ ప్రక్రియ కొనసాగుతుందని, ఏ రైతూ కంగారు పడాల్సిన అవసరం లేదని, సాగుకు యోగ్యమైన మిగతా రైతులందరికీ రైతు భరోసా పడనుందని పేర్కొన్నారు. 

Similar News

News December 13, 2025

జగిత్యాల: నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష కేంద్రాల పరిశీలన

image

జవహర్ నవోదయ విద్యాలయం 2026–2027 విద్యా సంవత్సరానికి గాను 6వ తరగతి ప్రవేశానికి నిర్వహించిన అర్హత పరీక్ష సందర్భంగా జిల్లా కేంద్రంలోని పరీక్ష కేంద్రాలను జిల్లా విద్యాశాఖ అధికారి కె.రాము శనివారం పరిశీలించారు. ప్రభుత్వ పురాతన ఉన్నత పాఠశాల, గోవిందుపల్లిలోని గౌతమ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల వసతులు, పరీక్ష ఏర్పాట్లు, హాజరు శాతం, ఇన్విజిలేటర్ల సన్నద్ధతను పరిశీలించి పరీక్షలు సజావుగా నిర్వహించాలని సూచించారు.

News December 13, 2025

ఇండియాకు కోహ్లీ.. మెస్సీని కలవడానికేనా?

image

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇండియాకు చేరుకున్నారు. తన భార్య అనుష్క శర్మతో కలిసి ముంబై ఎయిర్‌పోర్టులో కనిపించారు. ‘గోట్ టూర్’లో భాగంగా భారత్‌లో ఉన్న మెస్సీని కోహ్లీ కలుస్తారని ప్రచారం జరుగుతోంది. రేపు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఫ్యాన్స్‌ను మెస్సీ కలవనున్నారు. ఈ సమయంలోనే ఇద్దరు దిగ్గజాలు మీట్ అవుతారని అభిమానులు భావిస్తున్నారు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ తర్వాత కోహ్లీ <<18500552>>లండన్‌<<>>కు వెళ్లడం తెలిసిందే.

News December 13, 2025

పంచాయతీ ఎన్నికలకు 1500 మంది పోలీసు భద్రత

image

రెండో విడత పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు భద్రాద్రి ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. 1500 మంది పోలీసులతో భద్రతా ఉంటుందని, 1392 పోలింగ్ కేంద్రాల్లో సాధారణ 878, సమస్యాత్మక 179, అతి సమస్యాత్మక 285, మావోయిస్టు ప్రభావిత కేంద్రాలు 50 గుర్తించామన్నారు. ప్రజలందరూ నిర్భయంగా ఓటు వినియోగించుకోవాలని సూచించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విధులు నిర్వహించాలన్నారు.