News February 16, 2025
MDCL: ఇంటర్ విద్యార్థుల్లో ఒత్తిడి, నిద్రలేమి

ఇంటర్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల మానసిక సమస్యల పరిష్కారానికి టెలీ మానస్ ఏర్పాటు చేశారు. మేడ్చల్ జిల్లాలో డిసెంబర్, జనవరి నెలల్లో జిల్లాల వారీగా టెలీ మానస్ కేంద్రానికి వచ్చిన సమస్యలపై 14 మంది ఒత్తిడికి గురవుతున్నామని, ఇద్దరు సరిగ్గా నిద్ర పట్టడం లేదని, ఇతర సమస్యలతో 13 మంది టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Similar News
News March 20, 2025
మెదక్: నో హెల్మెట్.. NO ENTRY: కలెక్టర్

మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లోని అన్ని మండలాల ఎమ్మార్వోలతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆయా మండలాలలోని ఎమ్మార్వో కార్యాలయంలోకి వచ్చే ప్రతి ఒక్క వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి రావాలని సూచించారు. అదే విధంగా అన్ని ఎమ్మార్వో కార్యాలయాల్లో ప్లాస్టిక్ నిషేధించాలన్నారు.
News March 20, 2025
KMR: రాష్ట్రస్థాయి పోటీలకు 18 మంది

కామారెడ్డి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఇందిరాగాంధీ స్టేడియంలో జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. అండర్ 14, 16, 18, 20 విభాగాల్లో వివిధ అంశాల్లో మెన్, ఉమెన్ సెలెక్షన్స్ నిర్వహించగా.. 18 మంది ఉత్తమ ప్రతిభ కనబరిచారు. వీరందరూ.. ఈ నెల 23న గార్డియం స్టేడియం కొల్లూరు, HYDలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని అసోసియేషన్ కార్యదర్శి అనిల్ తెలిపారు.
News March 20, 2025
భైoసా: ఆల్ ఇండియా పోటీలకు తపాలా ఉద్యోగులు

ఓ వైపు విధులు నిర్వర్తిస్తూనే క్రీడల్లో సత్తాచాటి జాతీయస్థాయికి ఎంపికయ్యారు జిల్లాకు చెందిన తపాలా ఉద్యోగులు వినోద్ కుమార్, నరేశ్కుమార్. HYDలో జరిగిన జాతీయస్థాయి ఖోఖో పోటీల్లో ప్రతిభ కనబర్చి అల్ ఇండియా సివిల్ సర్వీసెస్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 21 నుంచి 24 వరకు ఢిల్లీలో జరిగే పోటీల్లో వీరు RSB HYD జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. అక్కడ కూడా ప్రతిభ చాటాలంటే ఆల్ ది బెస్ట్ చెప్పేయండి మరి.