News March 17, 2025

 MDCL: ఇన్వెస్ట్‌మెంట్‌ పేరిట మోసాలతో జాగ్రత్త 

image

రామంతపూర్లోని సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్లో రీజినల్ ఇన్వెస్టర్ సెమినార్ నిర్వహించారు. ఇందులో SEBI ED రామ్మోహన్ రావు మాట్లాడుతూ..ఇన్వెస్ట్మెంట్ పేరుతో జరిగే మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. నేషనల్ స్టాక్ ఎక్స్ ఛేంజ్, SEBI ద్వారా నిబంధనలు, ఇన్వెస్ట్మెంట్ పెట్టే విధానాల గురించి తెలుసుకోవచ్చన్నారు.

Similar News

News March 17, 2025

ప్రారంభమైన ఎనుమాముల మార్కెట్.. తగ్గిన పత్తి ధర

image

మూడు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల మార్కెట్ ఈరోజు ప్రారంభం కాగా.. పత్తి బస్తాలను అధిక సంఖ్యలో రైతులు మార్కెట్‌కు తీసుకువచ్చారు. అయితే తాము ఆశించిన స్థాయిలో ధర రాలేదని రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నేడు పత్తి ధర క్వింటాకి రూ.6,825 ధర పలికిందని చెప్పారు. గత వారం పత్తి ధర రూ.6,960 పలకగా ఈరోజు ధరలు భారీగా పడిపోవడంతో పత్తి రైతులు తీవ్ర నిరాశ చెందుతున్నారు.

News March 17, 2025

VKB: విషాదం.. ఈతకు వెళ్లి బాలుడి మృతి

image

వికారాబాద్ జిల్లా దోమ మండలం గన్యా నాయక్ తండాలో విషాదం చోటు చేసుకుంది. ఓ స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి నేనావత్ బాలాజీ (13) ఆదివారం మధ్యాహ్నం చెరువులో ఈతకు వెళ్లి చెరువులో మునిగి మృతిచెందాడు. ఈరోజు ఉదయం చెరువులో శవమై కనిపించాడు. బాలుడి మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News March 17, 2025

విషాదం: అమెరికాలో ముగ్గురు తెలంగాణవాసుల మ‌ృతి

image

TG: రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలానికి చెందిన ముగ్గురు అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. టేకులపల్లి మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి కుమార్తె ప్రగతి రెడ్డి(35), మనవడు హార్వీన్(6), ప్రగతి రెడ్డి అత్త సునీత(56)గా గుర్తించారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కన్నుమూయడం టేకులపల్లిలో విషాదాన్ని నింపింది.

error: Content is protected !!