News April 9, 2025

MDCL: ఏప్రిల్ 15 నుంచి ITI సప్లిమెంటరీ పరీక్షలు

image

ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ITI సప్లిమెంటరీ CBT పరీక్ష జరగనున్నట్లుగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్ ప్రభుత్వం ఐటీఐ కాలేజీ యజమాన్య బృం దం తెలిపింది. త్వరలోనే విద్యార్థులకు హాల్ టికెట్లు వస్తాయని, విద్యార్థులందరూ సిద్ధం కావాలని సూచించింది. గతంలో ఉన్న తేదీలను ITI నేషనల్ బృందం వాయిదా వేసినట్లు పేర్కొంది.

Similar News

News October 17, 2025

HYD: రేపటి బంద్ శాంతియుతంగా జరగాలి: డీజీపీ

image

వివిధ పార్టీలు తలపెట్టిన రేపటి బంద్ కార్యక్రమాన్ని శాంతియుతంగా జరుపుకోవాలని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. బంద్ పేరుతో అవాంఛనీయ ఘటనలకు గానీ, చట్ట వ్యతిరేక కార్యక్రమాలకుగానీ పాల్పడితే చట్టం ప్రకారం కఠినంగా వ్యవహరిస్తమన్నారు. పోలీస్ సిబ్బంది, నిఘా బృందాలు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తాయి. బంద్ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని డీజీపీ సూచించారు.

News October 17, 2025

తెలంగాణ న్యూస్ రౌండప్

image

* జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు నామినేషన్ వేసిన INC అభ్యర్థి నవీన్ యాదవ్
* గ్రామీణ ప్రాంతాల్లో హ్యామ్ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల.. 17 ప్యాకేజీల్లో 7,449km రోడ్లకు రూ.6,294 కోట్లు వెచ్చించనున్న ప్రభుత్వం
* మద్యం దుకాణాల టెండర్లకు రేపటితో ముగియనున్న గడువు.. 2,620వైన్స్‌లకు 25వేల దరఖాస్తులు
* బీసీ రిజర్వేషన్ల అంశంలో BJPని కాంగ్రెస్ బద్నాం చేస్తోందన్న MP డీకే అరుణ

News October 17, 2025

SDPT: స్థానిక ఎన్నికలు ఆలస్యం.. ఆశావాహుల్లో నిరుత్సాహం

image

స్థానిక ఎన్నికలు మరింత ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఆశవాహుల్లో నిరుత్సాహం నిండింది. ప్రభుత్వం బీసీలకు కల్పించిన 42% రిజర్వేషన్లపై కోర్టు స్టే ఇవ్వడంతో ఎన్నికల పక్రియ ఆగిపోయింది. దీంతో దసరాకు ముందు జోష్‌లో ఉన్న ఆయా పార్టీల నాయకులు ప్రస్తుతం చల్లబడిపోయారు. పాత రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలకు వెళితే ఎలా అన్న డైలామాలో పడ్డారు. 2018లో 225 స్థానాలు బీసీలకు దక్కగా రిజర్వేషన్లతో 327 స్థానాలు దక్కాయి.