News April 5, 2025

MDCL: జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇవే..!

image

MDCL జిల్లాలో యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు 12 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి తెలిపారు.ఘట్కేసర్ మండలంలో 1.ప్రతాపసింగారం, 2.ఏదులాబాద్, 3.మాదారం.. మూడు చింతలపల్లి మండలంలో 4.కేశవరం, 5.లక్ష్మాపూర్, 6.ఉద్దమర్రి, మేడ్చల్ మండలంలో 7.మేడ్చల్ 8.డబుల్పురా, 9.పూడూరు, 10.శామిర్పేట్, 11.అలియాబాద్, 12.కీసర మండల కేంద్రాల్లో కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News October 14, 2025

వాస్తుతో సంతోషకర జీవితం

image

ఇంటి వాస్తు బాగుంటేనే ఇంట్లో ఉండేవారందరూ సంతోషంగా ఉంటారని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘వాస్తు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మానసిక ప్రశాంతతను ఇస్తుంది. తద్వారా మంచి నిద్ర, విశ్రాంతి లభిస్తాయి. సామాజిక బంధాలను మెరుగుపరిచే ఆలోచనలు తెస్తాయి. అవి అవకాశాలను మోసుకొచ్చి ఆదాయాన్ని పెంచుతాయి. దీంతో ఆనందం కలుగుతుంది. సంతోషకరమైన జీవితానికి వాస్తు మూల కారణం’ అని అంటున్నారు. <<-se>>#Vasthu<<>>

News October 14, 2025

ఉత్కంఠ పోరు.. భారత్, పాక్ మ్యాచ్ డ్రా

image

మలేషియాలో జరుగుతున్న సుల్తాన్ ఆఫ్ జోహర్ కప్-2025 U21 హాకీ టోర్నీలో భారత్, పాక్‌ మ్యాచ్ డ్రాగా ముగిసింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఇరు జట్లు 3-3 గోల్స్ చేశాయి. ఒక దశలో 0-2తో వెనుకబడిన IND చివర్లో అద్భుతంగా పోరాడి 3-2‌తో లీడ్‌లోకి వెళ్లింది. విజయం ఖాయమనుకున్న సమయంలో పాక్ గోల్ కొట్టి లెవెల్ చేసింది. ఇప్పటికే బ్రిటన్, న్యూజిలాండ్‌పై గెలిచిన IND పాయింట్స్ టేబుల్‌లో టాప్‌లో కొనసాగుతోంది.

News October 14, 2025

ఇకపై అన్ని ఫ్యాక్టరీలలో మాక్ డ్రిల్: కలెక్టర్

image

జిల్లాలోని అన్ని ఫ్యాక్టరీలలో మాక్ డ్రిల్ నిర్వహించాలని కలెక్టర్ వెట్రి సెల్వి మంగళవారం ఆదేశించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఫ్యాక్టరీలలో ప్రమాదాలు సంభవించినప్పుడు కార్మికులు వాటి నుంచి బయటపడేలా, అప్రమత్తంగా ఉండేలా అవగాహన కల్పించాలన్నారు. భద్రతా చర్యలపై ప్రతి ఫ్యాక్టరీ నుంచి 30 రోజుల్లో నివేదిక ఇవ్వాలన్నారు. A కేటగిరిలో 4, B1లో 26, B2లో 6 మొత్తం 36 పరిశ్రమల భద్రతా ప్రమాణాలపై సమీక్షించారు.