News April 5, 2025

MDCL: జిల్లాలో 17.3 లక్షల మందికి రేషన్ బియ్యం..!

image

మేడ్చల్ జిల్లాకు సంబంధించిన రేషన్ కార్డులకు సంబంధించిన మరో రిపోర్టును Way2News సేకరించింది. నేటి వరకు జిల్లాలో రేషన్ కార్డుల సంఖ్య 5,30,590కు చేరిందని, దీంతో 17,37,600 మందికి 6 కిలోల చొప్పున రేషన్ బియ్యం అందుతుందని ఇన్‌ఛార్జి DCSO సుగుణ బాయి తెలిపారు. కులగణన ప్రకారం 12,243 దరఖాస్తులు రాగా, తాజాగా 6,818 రేషన్ కార్డులు జారీ అయ్యాయి.

Similar News

News December 24, 2025

సంగారెడ్డి: పీఎంశ్రీ పాఠశాలల్లో ‘బాలల రక్షణ’ అవగాహన

image

సంగారెడ్డి జిల్లాలోని 44 పీఎంశ్రీ పాఠశాలల్లో జనవరి 8 నుంచి 23 వరకు బాలల సంరక్షణ, భద్రతపై ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి తెలిపారు. విద్యార్థుల భద్రతే ధ్యేయంగా ప్రతిరోజూ వైవిధ్య భరిత కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా పిల్లలకు తమ హక్కులు, రక్షణ చట్టాలు, ఆపద సమయంలో ఆదుకునే టోల్ ఫ్రీ నంబర్లపై సమగ్ర అవగాహన కల్పిస్తామని వెల్లడించారు.

News December 24, 2025

పాలమూరు నీళ్ల రాజకీయం.. మళ్లీ మంటలు

image

ఒకప్పుడు కరవుకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న పాలమూరులో నీళ్ల రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. తెలంగాణ వస్తే జిల్లా పచ్చబడుతుందన్న హామీలతో ఉద్యమానికి ఊపునిచ్చిన KCR, పదేళ్లలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయలేకపోయారనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇక ‘పాలమూరు బిడ్డ’గా చెప్పుకునే CM రేవంత్ సర్కారుపై ఒత్తిడి పెరుగుతోంది. BRS ఆందోళనలకు సిద్ధమవుతుండగా, కాంగ్రెస్ పనులతో సమాధానం చెబుతామంటోంది.

News December 24, 2025

HNK: విద్యార్థినులపై అధ్యాపకుడి అసభ్య ప్రవర్తన?

image

హనుమకొండ జిల్లా పరకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న ఓ అధ్యాపకుడు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ ఫిర్యాదు అందిందని ప్రిన్సిపల్ సంతోష్‌కుమార్ తెలిపారు. ‘విద్యార్థిని తల్లిదండ్రులు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గతంలోనూ ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. 20వ తేదీ లోపు వివరణ ఇవ్వాలని మెమో ఇచ్చినా స్పందన లేకపోవడంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాం’ అని ఆమె చెప్పారు.