News February 19, 2025
MDCL: జిల్లాలో 437.26 మెట్రిక్ టన్నుల యూరియా

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత ఉందనేది అవాస్తవమని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చంద్రకళ తెలిపారు. మేడ్చల్ జిల్లా వ్యాప్తంగా పంటలు సాగులో ఉన్న 8 మండలాల్లో 437.26 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉన్నట్లుగా తెలిపారు. వ్యాపారులు, డీలర్లు కృత్రిమ కొరత సృష్టించి, రైతులను ఇబ్బందులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News October 16, 2025
NLG: దీపావళి ఆఫర్.. రూపాయికే సిమ్ కార్డ్

దీపావళి పండుగకు రూపాయికి బీఎస్ఎన్ఎల్ సిమ్ కార్డ్ ఆఫర్ ప్రవేశపెట్టినట్లు ఆ సంస్థ జనరల్ మేనేజర్ వెంకటేశ్వర్లు తెలిపారు. దీపావళి ప్రత్యేక పథకం ద్వారా ఒక్క రూపాయి ప్రీపెయిడ్ సిమ్ కార్డుతో నెల రోజుల పాటు అన్ని నెట్వర్క్కు అపరిమిత కాల్స్, రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆఫర్ కొత్తగా ప్రీపెయిడ్ సిమ్ తీసుకునే వారికి వర్తిస్తుందన్నారు.
News October 16, 2025
KMR: NMMS దరఖాస్తుల గడువు పొడగింపు

నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ (NMMS)-2025 దరఖాస్తు గడువు ఈ నెల 18 వరకు పొడిగించినట్లు డీఈఓ రాజు తెలిపారు. ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ/స్థానిక సంస్థల పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.3.50 లక్షలకు మించకూడదన్నారు. 7వ తరగతిలో కనీసం 55% మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులు https://bse.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News October 16, 2025
జహీరాబాద్: అప్పు తిరిగి ఇవ్వలేదని మహిళ సూసైడ్

జహీరాబాద్లోని అల్లిపూర్ షేరీనగర్ కాలనీకి చెందిన రాజు, స్వప్న(34) దంపతులు. అవసరాల కోసం బంగారంపై రూ.4 లక్షల రుణం తీసుకున్న రాజు.. డబ్బులను బ్యాంకులో కట్టమని భార్యకు ఇచ్చాడు. అయితే ఆ డబ్బులను ఆమె కోహీర్ మండలం గురుజువాడకు చెందిన శంకర్కు అప్పుగా ఇచ్చింది. కొంతకాలంగా ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగితే శంకర్ మొండికేశాడు. దీంతో భర్తకు ఎం చెప్పాలో తెలియక మానసిక వేదనకు గురైన స్వప్న ఇంట్లో ఉరేసుకుంది.