News February 10, 2025
MDCL: త్వరలో ఎన్నికలు.. ZP ఛైర్మన్ సీటుపై కన్ను..!

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జడ్పీ ఛైర్మన్ సీటుపై అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు కన్నేశారు. త్వరలోనే ZPTC, MPTC ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీటు దక్కించుకునేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో 3-ZPTC, 19- MPTC స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తర్వాత పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వనుంది. గతంలో 61 గ్రామాలు కలిగిన మేడ్చల్ జిల్లాలో 28 పంచాయతీల విలీనం అనంతరం ఆ సంఖ్య 33కు చేరింది.
Similar News
News April 14, 2026
అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్

బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డా. బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాలను కొనసాగించాలని కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలోని రాందాస్ చౌరస్తాలో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలనునిర్వహించారు. కలెక్టర్, ఎస్పీ శ్రీనివాస్ రావుతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
News April 14, 2026
నవ్వు వెనుక తీరని విషాదం.. చిత్ర ట్వీట్ వైరల్!

చెరగని చిరునవ్వుతో, మధురమైన గొంతుతో మనల్ని అలరించే సింగర్ చిత్ర మనసులో తీరని వేదన దాగి ఉందనే విషయం మీకు తెలుసా? 2011లో దుబాయ్లో తన ఒక్కగానొక్క బిడ్డ నందన కళ్లముందే స్విమ్మింగ్ పూల్లో పడి కన్నుమూశారు. ఇవాళ ఆమె వర్ధంతి కావడంతో చిత్ర భావోద్వేగ ట్వీట్ చేశారు. బిడ్డ లేదన్న నిజం ఎప్పటికీ బాధిస్తూనే ఉంటుందని, కానీ తన గుండెల్లో ఎప్పటికీ ఉంటుందని చిత్ర రాసుకొచ్చారు. ఇది చూసి ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు.
News April 14, 2026
ములుగు: ఆ గ్రామాలకు ట్యాంకుల ద్వారా తాగునీటి సరఫరా!

ఏటూరునాగారం మండలం గంటలకుంట, మామిడిగూడెంలో ‘మురుగునీరే విద్యార్థులకు తాగునీరు’ అనే శీర్షిక సోమవారం Way2News కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. మంత్రి సీతక్క ఆదేశాలతో కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి దేవేందర్ వాటర్ ట్యాంక్ ద్వారా గ్రామస్థుల నీరు సరఫరా చేస్తున్నారు. నీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అవసరమైతే సొంత ఖర్చులతో బోర్లు వేయించేందుకు మంత్రి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.


