News January 26, 2025

MDCL: నేటితో ముగియనున్న పాలకవర్గ గడువు

image

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పాలకవర్గ గడువు నేటితో ముగిసింది. నేటితో పాలకవర్గం సభ్యులు ఐదేళ్ల గడువు పూర్తి చేసుకున్నారు. ఘట్కేసర్, పోచారం, దమ్మాయిగూడ, మేడ్చల్ లాంటి మున్సిపాలిటీలు, బోడుప్పల్, పీర్జాదిగూడ కార్పొరేషన్లో సహా ఇందులో ఉన్నాయి. గత ఐదేళ్లలో 2024 వరకు BRS సభ్యుల ఆధిక్యం ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వ రాకతో పురపాలికల్లో కాంగ్రెస్ పాగా వేసింది.

Similar News

News November 27, 2025

వరంగల్: తొలి విడతలో 555 పంచాయతీలకు నామినేషన్లు

image

ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొలి విడత నామినేషన్లు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి విడతలో భాగంలో 23 మండలాల్లోని 555 గ్రామ పంచాయతీలకు, 4952 వార్డులకు నామినేషన్లు వేయనున్నాను. అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయడానికి 171 కేంద్రాలను జిల్లాల ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేశారు. ములుగులో 15, హనుమకొండలో 24, వరంగల్‌లో 29, జనగామలో 30, భూపాలపల్లిలో 24, మహబూబాబాద్‌లో 49 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

News November 27, 2025

బాపట్ల: ఇబ్బందులా.. ఈ నెంబర్లకు కాల్ చేయండి

image

బాపట్ల జిల్లాలో ధాన్యం కొనుగోలులో అవకతవకలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా.వి.వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణలో రైతులకు ఏవైనా ఇబ్బందులు కలిగితే ఫోన్ నంబర్ 1967 లేదా 77028 06804లను సంప్రదించాలని సూచించారు. ఈ నెంబర్లను కలెక్టర్ బుధవారం విడుదల చేశారు.

News November 27, 2025

నాయకుల ‘ఏకగ్రీవ’ ప్రకటనలు.. ఓటుకు విలువ లేదా?

image

TG: పంచాయతీ ఎన్నికల వేళ నాయకుల ఆఫర్లు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి. తమ పార్టీ వ్యక్తి సర్పంచ్‌గా ఏకగ్రీవమైతే గ్రామాభివృద్ధికి ₹10L-30L ఇస్తామంటున్నారు. అయితే ప్రజల ఓట్లతో గెలిస్తే నిధులివ్వరా? ఏకగ్రీవ ప్రస్తావన చట్టాల్లో ఉన్నప్పటికీ ఓటుకు విలువ లేదా? ‘పెద్దలు’ ఏకమై ఏకగ్రీవాలు చేసుకుంటే.. తమకు నచ్చిన వ్యక్తిని ఎంచుకునే హక్కు ప్రజలు కోల్పోవడం సమంజసమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మీరేమంటారు?