News February 19, 2025
MDCL: మీ సేవలపై ఇలా ఫిర్యాదు చేయండి..!

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధి అనేక ప్రాంతాల్లో రేషన్ కార్డులు దరఖాస్తుల ప్రక్రియ మీ సేవల్లో కొనసాగుతుంది. దరఖాస్తుకు అధిక ధరలు వసూలు చేస్తూ దోపిడీ చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.దీని పై తెలంగాణ స్టేట్ ఆన్ లైన్ హెల్ప్ లైన్ నంబర్ 040-45676699కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని మేడ్చల్ అధికారులు సూచించారు. రేషన్ కార్డు దరఖాస్తు కోసం కేవలం రూ.45 రుసుము మాత్రమే చెల్లించాలని సూచించారు.
Similar News
News December 20, 2025
సర్పంచ్ ఫలితాలు.. 18 మంది ఎమ్మెల్యేలపై PCC చీఫ్ అసంతృప్తి

TG: సర్పంచ్ ఫలితాల్లో ఆశించిన మేర ఫలితాలు రాలేదని 18 మంది MLAలపై AICC ఇన్ఛార్జ్ మీనాక్షి, TPCC చీఫ్ మహేశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రెబల్స్ను బుజ్జగించలేకపోవడం, బంధువులను నిలబెట్టడంతో పార్టీకి నష్టం జరిగిందని ఆగ్రహించారు. ఫలితాలపై CM రేవంత్ క్షేత్రస్థాయి నివేదిక తెప్పించుకుని రివ్యూ చేశారు. కొంత మంది MLAలను పార్టీపరంగా మందలించేందుకు ఆ నివేదికను PCC చీఫ్కు పంపించగా ఇవాళ సమీక్ష నిర్వహించారు.
News December 20, 2025
NZB: దొంగ నోట్లపై బీఆర్ఎస్ ట్వీట్

వర్ని కెనరా బ్యాంక్లో దొంగ నోట్ల కలకలం విషయం తెలిసిందే. సర్పంచ్ ఎన్నికల్లో దొంగ నోట్లు పంచి అడ్డంగా దొరికిన కాంగ్రెస్ అభ్యర్థులు అని బీఆర్ఎస్ తన అధికారిక X(ట్వట్టర్)లో పోస్టు చేసింది. దొంగనోట్లు తెచ్చిన వ్యక్తి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రధాన అనుచరుడని ఆరోపించింది. అయితే పోలీసులు చెప్పిన నిందితుని పేరు.. బీఆర్ఎస్ పోస్టు చేసిన నిందితుని పేర్లు వేర్వేరుగా ఉండటం గమనార్హం.
News December 20, 2025
జూలపల్లి: తమ్ముడు ఉప సర్పంచ్.. అక్క వార్డ్ మెంబర్

జూలపల్లి మండలం కుమ్మరికుంట గ్రామంలో ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో విశేష ఫలితం వెలువడింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అభ్యర్థులు ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. ఆవుల శ్రీనివాస్ యాదవ్ వార్డు మెంబర్గా గెలిచి ఉప సర్పంచ్గా ఎన్నికయ్యారు. ఆయన సోదరి తమ్మడవేణి రాధ మరో వార్డు మెంబర్గా విజయం సాధించారు. తమ్ముడు ఉప సర్పంచ్గా, అక్క వార్డు మెంబర్గా ఎన్నిక కావడంపై గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొంది.


