News February 19, 2025

MDCL: మీ సేవలపై ఇలా ఫిర్యాదు చేయండి..!

image

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధి అనేక ప్రాంతాల్లో రేషన్ కార్డులు దరఖాస్తుల ప్రక్రియ మీ సేవల్లో కొనసాగుతుంది. దరఖాస్తుకు అధిక ధరలు వసూలు చేస్తూ దోపిడీ చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.దీని పై తెలంగాణ స్టేట్ ఆన్ లైన్ హెల్ప్ లైన్ నంబర్ 040-45676699కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని మేడ్చల్ అధికారులు సూచించారు. రేషన్ కార్డు దరఖాస్తు కోసం కేవలం రూ.45 రుసుము మాత్రమే చెల్లించాలని సూచించారు.

Similar News

News January 11, 2026

బాపట్ల: సెంట్రల్ జైల్ నుంచి ఖైదీ పరార్

image

నెల్లూరు సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న బాపట్ల జిల్లా ఖైదీ పరారయ్యాడు. భట్టిప్రోలు గ్రామానికి చెందిన షేక్ చిన్న సైదులు 2022 సంవత్సరంలో తన భార్యను హత్య చేసి శిక్షను అనుభవిస్తున్నాడు. రెండు సంవత్సరాలు రాజమండ్రి జైలులో ఉన్న అతడిని నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. సత్ప్రవర్తన కింద ఓపెన్ జైలుకు తరలించారు. వ్యవసాయ పనులు చేస్తూ పరారయ్యాడు.

News January 11, 2026

అమెరికా గుప్పిట్లో వెనిజులా నిధులు.. ఆయిల్ ఆదాయం సేఫ్

image

వెనిజులా ఆయిల్ ఆదాయంపై ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అకౌంట్లలో ఉండే ఆ సొమ్మును ఎవరూ జప్తు చేయకుండా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. ఈ డబ్బును US తన విదేశీ విధానాల కోసం వాడుకోనుంది. నార్కో టెర్రరిజం అరికట్టడానికి, అక్రమ వలసలు ఆపడానికి ఈ నిధులు ఉపయోగపడతాయని వైట్ హౌస్ తెలిపింది. వెనిజులా ఇకపై అమెరికాతోనే వ్యాపారం చేస్తుందని, ఇది రెండు దేశాలకు మంచిదని ట్రంప్ చెప్పారు.

News January 11, 2026

నేడు రామగుండంలో మంత్రుల పర్యటన

image

రామగుండం నగరంలో నేడు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటించి రూ.175 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. అనంతరం గోదావరిఖని బాలుర జూనియర్ కళాశాల మైదానంలో బహిరంగ సభలో ఇండ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.