News February 20, 2025

MDCL: మెడిసిన్ కొంటున్నారా? తేడా వస్తే కాల్ చేయండి!

image

MDCL మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల DCA అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. ఔషధ దుకాణాల్లో మెడిసిన్లను రిటైల్ రేట్లకు సరిగ్గా విక్రయించడం, లైసెన్స్ లేకపోవడం, చట్ట విరుద్ధమైన మెడిసిన్స్ విక్రయించడం లాంటివి జరుగుతున్నట్లు గుర్తించారు. మీ ప్రాంతంలో మెడిసిన్ కొనుగోలు చేసేటప్పుడు, ఏదైనా తేడాగా కనిపిస్తే 1800-599-6969కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.

Similar News

News September 17, 2025

HYD: SEP 17.. ఇదే కదా నిజమైన సాతంత్ర్యం!

image

1947, AUG 15.. దేశమంతా స్వేచ్ఛా గాలులు పీల్చుతుంటే HYD ప్రజలు నిజాం, దొరలు, రజాకార్ల నిర్బంధంలో ఉన్నారు. అప్పటికే(1946) తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం పురుడుపోసుకుంది. భారత స్వాతంత్ర్య స్ఫూర్తి HYD సంస్థానాన్ని ఆహ్వానించిందేమో మరి.. ఏళ్లుగా ఏడ్చిన కళ్లు ఎర్రబడ్డాయి. నీ బాంచన్ దొర అన్న జనం బ్యాంచత్ అని రాయి, రప్ప, సుత్తె, కత్తి చేతబట్టి పోరాడారు. చివరకు 1948 SEP 17న ‘ఆపరేషన్ పోలో’తో స్వేచ్ఛను పొందారు.

News September 17, 2025

సిరిసిల్ల: ‘రైతుల వివరాల యాప్‌ను సిద్ధం చేయాలి’

image

రైతుల వివరాలతో యాప్‌ను సిద్ధం చేయాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. సిరిసిల్ల కలెక్టరేట్లో వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని రైతుల వివరాలతో యాప్‌ను సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అలాగే ఆయిల్ పామ్ పంట సాగుపై రైతులకు సలహాలు, సూచనలు అందించేందుకు 9398684240 టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశామన్నారు.

News September 17, 2025

బండి సంజయ్ చొరవతో మూడు ప్రాజెక్టులకు ఆమోదం

image

KNR పార్లమెంటు పరిధిలో కేంద్రమంత్రి బండి సంజయ్ చొరవతో మూడు ప్రాజెక్టులకు ఆమోదం లభించాయి. గన్నేరువరం మండలంలో మానేరు నదిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.77కోట్లు, వేములవాడ-సిరికొండ రోడ్డు నిర్మాణానికి రూ.23కోట్లు, ఆర్నకొండ–మల్యాల డబుల్ రోడ్డు విస్తరణ పనులకు రూ.50 కోట్ల మంజూరయ్యాయి. ఈ సందర్భంగా ఆమోదం తెలిపిన PM నరేంద్రమోదీ, కేంద్రమంత్రి గడ్కరీ, ఆ శాఖ ఉన్నతాధికారులకు బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు.