News February 20, 2025
MDCL: మెడిసిన్ కొంటున్నారా? తేడా వస్తే కాల్ చేయండి!

MDCL మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల DCA అధికారులు తనిఖీలు చేపడుతున్నారు. ఔషధ దుకాణాల్లో మెడిసిన్లను రిటైల్ రేట్లకు సరిగ్గా విక్రయించడం, లైసెన్స్ లేకపోవడం, చట్ట విరుద్ధమైన మెడిసిన్స్ విక్రయించడం లాంటివి జరుగుతున్నట్లు గుర్తించారు. మీ ప్రాంతంలో మెడిసిన్ కొనుగోలు చేసేటప్పుడు, ఏదైనా తేడాగా కనిపిస్తే 1800-599-6969కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.
Similar News
News December 6, 2025
నాగర్ కర్నూల్: అత్యల్పంగా 13 డిగ్రీల ఉష్ణోగ్రత

నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత మరింత పెరిగింది. తుఫాన్ ప్రభావం వల్ల వారం రోజులపాటు చలి తీవ్రత తగ్గినప్పటికీ రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా చలి పెరిగింది. శనివారం వెల్దండలో 13 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తోటపల్లి 14, కల్వకుర్తి 14.4, బిజినపల్లిలో 14.7 డిగ్రీలు నమోదయ్యాయి.
News December 6, 2025
నిర్మల్: ముగిసిన మూడవదశ నామినేషన్ ప్రక్రియ

నిర్మల్ జిల్లాలో మూడవ దశ నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఐదు మండలాల్లో మొత్తం 714 మంది అభ్యర్థులు సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేసినట్లు అడిషనల్ డిస్టిక్ ఎలక్షన్ అథారిటీ డీపీఓ ప్రకటనలో తెలిపారు. చివరి రోజు అత్యధికంగా కుబీర్ మండలంలో 116 మంది అభ్యర్థులు సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. కాగా ఐదు మండలాల్లో 133 సర్పంచ్ స్థానాలకు 714 మంది పోటీ పడుతున్నారు.
News December 6, 2025
నిజమైన భక్తులు ఎవరంటే?

ఏదో ఆశించి భగవంతుడిని సేవించేవారు వ్యాపారస్తులు. వారు తమ కోరికల కోసం దేవునికి డబ్బు ఇచ్చి బదులుగా ఏదో ఆశిస్తారు. కానీ ఫలాపేక్ష లేకుండా స్వామిని కొలిచేవారే నిజమైన భక్తులు. మనం అడగకుండానే దేవుడు కరుణించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కష్టాలన్నీ ఆయన భగవతం ద్వారానే ధరించాడు. ఇదే నిస్వార్థ భక్తి. మనం ఏమీ ఆశించకుండా మన శక్తి మేరకు సత్కార్యాలు చేస్తూ, ఆ ఈశ్వరుడిని అందరిలో చూస్తూ సంతోషాన్ని పంచాలి. <<-se>>#Daivam<<>>


