News March 17, 2025
MDCL: ఇన్వెస్ట్మెంట్ పేరిట మోసాలతో జాగ్రత్త

రామంతపూర్లోని సెంట్రల్ డిటెక్టివ్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్లో రీజినల్ ఇన్వెస్టర్ సెమినార్ నిర్వహించారు. ఇందులో SEBI ED రామ్మోహన్ రావు మాట్లాడుతూ..ఇన్వెస్ట్మెంట్ పేరుతో జరిగే మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. నేషనల్ స్టాక్ ఎక్స్ ఛేంజ్, SEBI ద్వారా నిబంధనలు, ఇన్వెస్ట్మెంట్ పెట్టే విధానాల గురించి తెలుసుకోవచ్చన్నారు.
Similar News
News March 17, 2025
IPL: RRతో మ్యాచ్కు SRH జట్టు ఇదేనా?

IPL 2025లో సన్రైజర్స్ హైదరాబాద్ తమ తొలి మ్యాచ్లో రాజస్థాన్తో తలపడనుంది. ఈ నెల 23న జరిగే ఈ మ్యాచులో బరిలోకి దిగే తుది జట్టును ESPN క్రిక్ఇన్ఫో అంచనా వేసింది. ముల్డర్, మెండిస్, జంపాను పరిగణనలోకి తీసుకోలేదు. జట్టు: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (WK), నితీశ్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్, అభినవ్ మనోహర్, కమిన్స్ (C), హర్షల్ పటేల్, రాహుల్ చాహర్, మహ్మద్ షమీ. జట్టు అంచనాపై మీ కామెంట్.
News March 17, 2025
NZB: ఓపెన్ SSC, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల: DEO

ఓపెన్ SSC, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ తెలిపారు. ఈ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి 26 వరకు రెండు సమయాల్లో కొనసాగుతాయని వివరించారు. అలాగే ఏప్రిల్ 26వ తేదీ నుంచి మే 3 వరకు ఇంటర్ విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు ఉంటాయన్నారు. కావున విద్యార్థులు పరీక్షల కోసం సన్నద్ధం కావాలని సూచించారు. సందేహాలు ఉంటే కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.
News March 17, 2025
‘రూ’ అక్షరాన్ని నిర్మలా సీతారామన్ కూడా వాడారు: స్టాలిన్

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం గతంలో తమిళ ‘రూ’ సింబల్ ని వాడారని CM స్టాలిన్ అన్నారు. ప్రస్తుతం మా ప్రభుత్వం కూడా ‘రూ’ అనే అక్షరాన్ని వినియోగించిందని, అందులో తప్పేంటని ప్రశ్నించారు. తమ మాతృభాషను రక్షించుకోవడానికే NEPని వ్యతిరేకిస్తున్నామని, భాషపై గందరగోళం సృష్టించేవారు కేంద్రమంత్రి చర్య పైనా మాట్లాడాలని అన్నారు. బడ్జెట్ సమయంలో ‘రూ’ అక్షరం వాడటంతో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే.