News March 29, 2025
MDCL: గిరిజన తండాలు.. గొప్పగా మారేనా..?

MDCL మల్కాజిగిరి పరిధిలోని 61 గ్రామపంచాయతీల పరిసర ప్రాంతాల్లో అనేక గిరిజన తండాలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ మున్సిపాలిటీల కిందికి వెళ్లనున్న నేపథ్యంలో గిరిజన తండాలు గొప్ప అభివృద్ధి ప్రాంతాలుగా మారుతాయా..? అని అక్కడ ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రభుత్వం మా వెనుకబడ్డ గిరిజన తండాల అభివృద్ధికి కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Similar News
News March 31, 2025
జీవీఎంసీ కార్పొరేటర్లతో భేటీ కానున్న పవన్కళ్యాణ్

సీతమ్మధార జనసేన కార్యాలయంలో ఆ పార్టీ కార్పొరేటర్లతో మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడారు. క్యాంపు రాజకీయల సంస్కృతి పార్టీలో ఉండకూడదన్నారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాటే శిరోధార్యమని వెల్లడించారు. త్వరలో అమరావతిలో 11 మంది జనసేన కార్పొరేటర్లతో పవన్ కళ్యాణ్ భేటీ ఉంటుందని ఆయన తెలిపారు.
News March 31, 2025
ధోనీ మ్యాచ్ విన్నర్ కాదు.. ఈ గణాంకాలే నిదర్శనం: విశ్లేషకులు

క్రికెట్లో ధోనీ బెస్ట్ ఫినిషర్. అతను చివరి వరకు క్రీజులో ఉంటే గెలుపు ఖాయమనే మాటలకు ఇక కాలం చెల్లినట్లే. అతని IPL గణాంకాలే ఇందుకు నిదర్శనం. 2023 నుంచి ఇప్పటి వరకు ఛేజింగ్ చేస్తూ జట్టు గెలిచిన సందర్భాల్లో అతను 3 మ్యాచ్లలో 3 రన్స్(9 బాల్స్) మాత్రమే చేశారు. ఓడిన గేమ్స్లో 6 Innsలలో 166 రన్స్(84 బంతులు) చేశారు. దీన్నిబట్టి టీమ్ విజయాల్లో ధోనీ పాత్ర ఏమీ లేదని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మీరేమంటారు?
News March 31, 2025
అనకాపల్లి-అచ్యుతాపురం రోడ్డు పనులకు శంకుస్థాపన

అనకాపల్లి-అచ్యుతాపురం రహదారి విస్తరణ పనులకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం సాయంత్రం అచ్యుతాపురం వద్ద శంకుస్థాపన చేశారు. రూ.243 కోట్లతో నాలుగు లైన్ల రహదారితో పాటు ఫ్లైఓవర్ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. 13.8 కిలోమీటర్ల పొడవునా నాలుగులైన్ల రహదారిగా విస్తరించనున్నారు. అచ్యుతాపురం మండలం మోసయ్యపేటలో ఫ్లైఓవర్ను నిర్మిస్తారు. శంకుస్థాపన అనంతరం మంత్రి లోకేశ్ విశాఖ విమానాశ్రయానికి వెళ్లారు.