News April 5, 2025
MDCL: జిల్లాలో 17.3 లక్షల మందికి రేషన్ బియ్యం..!

మేడ్చల్ జిల్లాకు సంబంధించిన రేషన్ కార్డులకు సంబంధించిన మరో రిపోర్టును Way2News సేకరించింది. నేటి వరకు జిల్లాలో రేషన్ కార్డుల సంఖ్య 5,30,590కు చేరిందని, దీంతో 17,37,600 మందికి 6 కిలోల చొప్పున రేషన్ బియ్యం అందుతుందని ఇన్ఛార్జి DCSO సుగుణ బాయి తెలిపారు. కులగణన ప్రకారం 12,243 దరఖాస్తులు రాగా, తాజాగా 6,818 రేషన్ కార్డులు జారీ అయ్యాయి.
Similar News
News December 27, 2025
అంటే.. ఏంటి?: Backyard

ఇంటి వెనక పెరటిని Backyard అంటారు. ఇది Back, Yard పదాలను కలిపితే వచ్చింది. Back అనే ఇంగ్లిష్ పదానికి వెనక అని అర్థం. జర్మన్లో Gard అంటే తోట. ఆ పదాన్ని ఇంగ్లిష్లోని స్థలం కొలిచే ప్రమాణమైన Yardతో పోలుస్తూ BackYardగా పిలుస్తున్నారు.
రోజూ 12pmకు ఓ ఆంగ్ల పదం అర్థం, వివరణ, పుట్టుక
<<-se>>#AnteEnti<<>>
News December 27, 2025
APPLY NOW: NHIDCLలో ఉద్యోగాలు

NHIDCLలో 64 అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 12వరకు అప్లై చేసుకోవచ్చు. సివిల్ ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. జీతం నెలకు రూ.70,000-రూ.80,000 చెల్లిస్తారు. వెబ్సైట్: https://www.nhidcl.com
News December 27, 2025
భూపాలపల్లి నుంచి మేడారానికి బస్సులు

భూపాలపల్లి నుంచి మేడారానికి ముందస్తు బస్సు సర్వీసులు ప్రారంభించినట్లు డిపో మేనేజర్ ఇందు తెలిపారు. భూపాలపల్లి నుంచి మేడారానికి ఉదయం 8, 9 గం.లకు, సాయంత్రం 4.10, 5.10 ని.లకు తిరిగి మేడారం నుంచి ఉదయం 10.40, 11.40 ని.లకు, సాయంత్రం 6.45, 7.45 ని.లకు బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బస్సులు గణపురం, ములుగు, పస్రా, తాడ్వాయి మీదుగా వెళ్తాయని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.


