News March 28, 2025
MDCL: మిషన్ భగీరథ ఇంజనీర్లకు మంత్రి ఆదేశాలు

HYDలో MDCL,RR సహా ఇతర జిల్లాల మిషన్ భగీరథ CE, SE, DE ఇంజనీర్లతో మంత్రి సీతక్క సమావేశమై పలు సూచనలు చేశారు. ✓ఇంజినీర్లు వారంలో 4 రోజులు క్షేత్రస్థాయిలో ఉండాలి✓మండల స్థాయిలో ప్రత్యేక కమిటీలు ఏర్పాటు✓పండుగల సమయంలో తాగునీటి సమస్యలు రాకుండా ప్రత్యేక చర్యలు✓అభివృద్ధి పనుల వల్ల పైపుల డ్యామేజ్ కాకుండా జిల్లా కలెక్టర్లతో సమన్వయం✓ కొత్త బోర్ల వైపు కాకుండా ప్రజలకు అవగాహన కల్పించాలి.
Similar News
News November 15, 2025
39,506 మారుతీ గ్రాండ్ విటారా కార్లు వెనక్కి

సాంకేతిక సమస్యలు తలెత్తిన గ్రాండ్ విటారా మోడల్ కార్లను వెనక్కి రప్పిస్తున్నట్లు మారుతీ సుజుకీ ప్రకటించింది. 2024 DEC 9 నుంచి 2025 APR 29 వరకు తయారైన 39,506 కార్లలో సమస్య ఉన్నట్లు వెల్లడించింది. ఫ్యూయెల్ లెవెల్ ఇండికేటర్, వార్నింగ్ లైట్ సిస్టమ్లో లోపాలను గుర్తించినట్లు పేర్కొంది. ఆథరైజ్డ్ డీలర్ వర్క్షాప్స్లో ఆ కార్లను పరీక్షించి లోపాలున్న పరికరాలను ఉచితంగా రీప్లేస్ చేయనున్నట్లు వివరించింది.
News November 15, 2025
ప.గో జడ్పీ కార్యాలయంలో 14 మందికి ప్రమోషన్స్

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో పనిచేస్తున్న 14 మంది దిగువ శ్రేణి సిబ్బందికి పదోన్నతి కల్పిస్తూ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గంటా పద్మశ్రీ శనివారం ఉత్తర్వులు అందజేశారు. జిల్లా పరిషత్ యాజమాన్యం తమ శ్రమను గుర్తించి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో సమర్థవంతంగా పనిచేయాలని పద్మశ్రీ సూచించారు.
News November 15, 2025
మహిళా PSల డీఎస్పీగా యు.రవిచంద్ర

ఉమ్మడి పశ్చిమ గోదావరి మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా రవి చంద్ర శనివారం బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర పోలీస్ శాఖ నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తానని డీఎస్పీ తెలిపారు. మహిళలు,బాలికల రక్షణ, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, మహిళలపై జరిగే నేరాల విషయంలో వేగవంతమైన, పారదర్శకమైన విచారణకు కృషి చేస్తామని పేర్కొన్నారు.


