News July 5, 2025

MDCL: వీకెండ్.. ప్రకృతి రమణీయ ప్రాంతాలు ఇవే..!

image

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో అనేక చోట్ల ప్రకృతి రమణీయత ఉట్టి పడుతుంది. జిల్లాలోని ఈ ప్రాంతాల్లో ఫ్యామిలీతో కలిసి వీకెండ్ ఎంజాయ్ చేయవచ్చు. కండ్లకోయ ఆక్సిజన్ పార్కు, నారపల్లి నందనవనం, జటాయువు పార్కు, కీసరగుట్ట వనం, నాగారం లంగ్స్ పార్క్, శామీర్పేటలోని జింకల పార్కు, టూరిజం రిసార్టులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇటివలే కురిసిన వర్షాలతో పచ్చదనం మరింత పెరిగింది.

Similar News

News July 5, 2025

ఒంటరితనం.. ఒకరికొకరు పలకరించుకుంటే మేలు!

image

బంధాలు, బంధుత్వాలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు కుటుంబాల్లో, స్నేహితుల్లో ప్రేమానురాగాలు ఉండేవి. ప్రస్తుతం సంపాదనలో పడి ఒకరి గురించి మరొకరు ఆలోచించడమే మానేశారు. దీంతో ఎంతో మంది ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. దీని వల్ల ప్రతి గంటకు వంద మంది చనిపోతున్నట్లు WHO చెబుతోంది. ఇండియాలో యువత సామాజిక సంబంధాలకు దూరంగా స్క్రీన్‌కు దగ్గరగా ఉంటూ మానసిక, శారీరక సమస్యలు తెచ్చుకుంటోందని పేర్కొంది.

News July 5, 2025

గంభీరావుపేట: ‘చెక్ డ్యాం నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలి’

image

గంభీరావుపేట మండలం గోరంటాలలో లోతువాగు వద్ద చెక్ డ్యాం నిర్మాణానికి స్థలాన్ని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పరిశీలించారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద లోతువాగు వద్ద చెక్ డ్యాం నిర్మాణానికి సర్వే చేయాలని, నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో డీఆర్డీఓ శేషాద్రి, ఎంపీడీవోలు, తహశీల్దార్లు, సంబంధిత అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

News July 5, 2025

NRPT: భర్తను హత్య చేసిన భార్య

image

ప్రియుడితో మాట్లాడొద్దన్నందుకు భర్తను భార్య గొంతునులిమి హత్య చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. NRPT(M) కోటకొండ వాసి అంజిలప్ప(32)కు ధన్వాడ(M) రాంకిష్టయ్యపల్లి వాసి రాధతో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరు HYDలో ఉంటూ కూలి పనిచేస్తూ ఉండేవారు. రాధకు ధన్వాడకి చెందిన యువకుడితో వివాహేతర సంబంధం ఉంది. దీనిపై మందలించిన భర్తను ఆమె గత నెల 23న హత్యచేసింది. కుటుంబసభ్యుల అనుమానం మేరకు విచారించగా విషయం బయటపడింది.