News March 2, 2025
MDCL: 1.21 లక్షల రేషన్ కార్డులు పెండింగ్..!

మేడ్చల్ జిల్లాలోని GHMC ప్రాంతం, మున్సిపాలిటీలు, మండలాల నుంచి 1,21,016 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇవి DCSO లాగిన్లో పెండింగ్లో ఉన్నాయి. కాగా.. MDCL రూరల్లో గ్రామ, వార్డు సభల్లో స్వీకరించిన 33,435 దరఖాస్తులను, ప్రభుత్వం నిర్వహించిన కుల గణన ద్వారా వేరిఫై చేసి, వీటి నుంచి 6,700 కార్డులు తాజాగా మంజూరు చేశారు. దీంతో మిగితా వారు రేషన్ కార్డుల కోసం వేచి చూస్తున్నారు.
Similar News
News November 19, 2025
అన్నమయ్య జిల్లా DCHS సస్పెండ్

మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసు రాష్ట్రంలో సంచలనమైంది. ఈ కేసులో అన్నమయ్య జిల్లా DCHS డా.ఆంజనేయులును సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. మదనపల్లె గ్లోబల్ ఆస్పత్రి కేంద్రంగా కిడ్నీ రాకెట్ ముఠా పనిచేసింది. వాళ్లతో ఆంజనేయులుకు సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆయనను సస్పెండ్ చేసి డా.లక్ష్మీప్రసాద్ రెడ్డిని ఇన్ఛార్జ్ డీసీహెచ్ఎస్గా నియమించారు.
News November 19, 2025
ఐబొమ్మతో పైరసీ ఆగిపోతుందా?.. సీవీ ఆనంద్ రిప్లై ఇదే!

TG: కొందరిని అరెస్టు చేయగానే సైబర్ క్రైమ్స్ పూర్తిగా ఆగిపోవని హోంశాఖ స్పెషల్ సీఎస్ CV ఆనంద్ అన్నారు. “ఐబొమ్మతో పైరసీ ఆగిపోతుందా?” అంటూ Xలో చేసిన పోస్టుపై ఆయన స్పందించారు. ‘ఒకడు పోతే మరొకడు వస్తాడు. ఈ నేరాలు కొనసాగుతూనే ఉంటాయి. మన చేతిలో ఉంది నివారణ ఒక్కటే. తక్షణమే డబ్బు సంపాదించాలన్న ఆశ తగ్గించుకోవాలి. సైబర్ నేరాలకు ఇదే మూల కారణం. రాజమౌళి చెప్పినట్లు జీవితంలో ఏదీ ఫ్రీగా రాదు’ అని పేర్కొన్నారు.
News November 19, 2025
HYD: నేడు PG, PhD రెండో విడత కౌన్సెలింగ్

రాజేంద్రనగర్లోని ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2025- 26 విద్యా సంవత్సరానికి సంబంధించిన PG & PhD ప్రవేశాలకు 2వ విడత కౌన్సిలింగ్ నేడు జరగనుంది. యూనివర్సిటీ ఆడిటోరియంలో మ.3 గం.కు నిర్వహించనున్నారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్థులు హాజరుకావాలని, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం విశ్వవిద్యాలయం వెబ్సైట్ను సంప్రదించాలన్నారు.


