News March 24, 2025

MDCL:TARGET..రోడ్ల పై ఎక్కడికక్కడ తనిఖీలు!

image

మేడ్చల్ జిల్లాలో రవాణాశాఖ అధికారులు టార్గెట్ రీచ్ కావడంపై ఫోకస్ పెట్టారు. MDCL జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్నారు. జిల్లా రవాణాశాఖ లక్ష్యం రూ.1,279.58 కోట్లు కాగా.. ఫిబ్రవరి 28 నాటికి కేవలం రూ.1,144.88 కోట్లు మాత్రమే ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. మార్చి 31నాటికి మేడ్చల్ జిల్లా నుంచి ఇంకా రూ.134.67 కోట్ల ఆదాయం సమకూరితే లక్ష్యం చేరుకుంటుంది.

Similar News

News December 6, 2025

నాగర్ కర్నూల్: అత్యల్పంగా 13 డిగ్రీల ఉష్ణోగ్రత

image

నాగర్ కర్నూల్ జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత మరింత పెరిగింది. తుఫాన్ ప్రభావం వల్ల వారం రోజులపాటు చలి తీవ్రత తగ్గినప్పటికీ రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా చలి పెరిగింది. శనివారం వెల్దండలో 13 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తోటపల్లి 14, కల్వకుర్తి 14.4, బిజినపల్లిలో 14.7 డిగ్రీలు నమోదయ్యాయి.

News December 6, 2025

నిర్మల్: ముగిసిన మూడవదశ నామినేషన్ ప్రక్రియ

image

నిర్మల్ జిల్లాలో మూడవ దశ నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఐదు మండలాల్లో మొత్తం 714 మంది అభ్యర్థులు సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేసినట్లు అడిషనల్ డిస్టిక్ ఎలక్షన్ అథారిటీ డీపీఓ ప్రకటనలో తెలిపారు. చివరి రోజు అత్యధికంగా కుబీర్ మండలంలో 116 మంది అభ్యర్థులు సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. కాగా ఐదు మండలాల్లో 133 సర్పంచ్ స్థానాలకు 714 మంది పోటీ పడుతున్నారు.

News December 6, 2025

నిజమైన భక్తులు ఎవరంటే?

image

ఏదో ఆశించి భగవంతుడిని సేవించేవారు వ్యాపారస్తులు. వారు తమ కోరికల కోసం దేవునికి డబ్బు ఇచ్చి బదులుగా ఏదో ఆశిస్తారు. కానీ ఫలాపేక్ష లేకుండా స్వామిని కొలిచేవారే నిజమైన భక్తులు. మనం అడగకుండానే దేవుడు కరుణించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కష్టాలన్నీ ఆయన భగవతం ద్వారానే ధరించాడు. ఇదే నిస్వార్థ భక్తి. మనం ఏమీ ఆశించకుండా మన శక్తి మేరకు సత్కార్యాలు చేస్తూ, ఆ ఈశ్వరుడిని అందరిలో చూస్తూ సంతోషాన్ని పంచాలి. <<-se>>#Daivam<<>>