News March 24, 2025

MDCL:TARGET..రోడ్ల పై ఎక్కడికక్కడ తనిఖీలు!

image

మేడ్చల్ జిల్లాలో రవాణాశాఖ అధికారులు టార్గెట్ రీచ్ కావడంపై ఫోకస్ పెట్టారు. MDCL జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్నారు. జిల్లా రవాణాశాఖ లక్ష్యం రూ.1,279.58 కోట్లు కాగా.. ఫిబ్రవరి 28 నాటికి కేవలం రూ.1,144.88 కోట్లు మాత్రమే ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. మార్చి 31నాటికి మేడ్చల్ జిల్లా నుంచి ఇంకా రూ.134.67 కోట్ల ఆదాయం సమకూరితే లక్ష్యం చేరుకుంటుంది.

Similar News

News November 9, 2025

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆర్పీఎస్ అభ్యర్థులు: నాగరాజు

image

రాష్ట్రంలో జరిగే ప్రతి ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో రిజర్వేషన్ల పరిరక్షణ సమితి (ఆర్పీఎస్) అభ్యర్థులు పోటీ చేస్తారని ఆర్పీఎస్ వ్యవస్థాపకుడు డా.పోతుల నాగరాజు తెలిపారు. శనివారం ఆయన అనంతపురంలోని ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడారు. ఎమ్మెల్సీలను నమ్మి ఓటు వేసిన గ్రాడ్యుయేట్, ఉద్యోగ, ఉపాధ్యాయ ఓటర్లను మోసం చేస్తున్నందునే వచ్చే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆర్పీఎస్ పోటీ చేస్తుందన్నారు.

News November 9, 2025

సింగరేణిలో ఎగ్జిక్యూటివ్ క్యాడ‌ర్ పోస్టుల‌ భ‌ర్తీకి సర్క్యులర్ జారీ

image

సింగ‌రేణి సంస్థలో అంతర్గత అభ్యర్థులతో ఎగ్జిక్యూటివ్ క్యాడ‌ర్ పోస్టుల‌ భ‌ర్తీకి యాజమాన్యం స‌ర్క్యుల‌ర్ విడుద‌ల‌ చేసింది. ఈ 2 గ్రేడ్‌లో అసిస్టెంట్ ఇంజినీర్ (ఈ&ఎం) పోస్టులు 23, సివిల్‌లో 4, ఈ 1 గ్రేడ్‌లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఈ&ఏం) పోస్టులు 33, సివిల్‌లో 6, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ 16 పోస్టులు భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 10 నుంచి 24లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు

News November 9, 2025

ధర్మపురి నర్సన్నకు భారీ ఆదాయం

image

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయానికి శనివారం భక్తుల తాకిడీ పెరిగింది. దీంతో అదే మొత్తంలో నర్సన్నకు భారీగా ఆదాయం సమకూరింది. దేవాలయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. టికెట్ల ద్వారా రూ.2,72,258, ప్రసాదాల ద్వారా రూ.1,95,750, అన్నదానం ద్వారా రూ.57,759.. మొత్తం ఆదాయం రూ.5,25,767 ఆదాయం వచ్చింది. కార్తీక మాసం కావడంతో భక్తుల సంఖ్య భారీగా పెరిగినట్లు దేవాలయ అధికారులు తెలిపారు.