News March 24, 2025
MDCL:TARGET..రోడ్ల పై ఎక్కడికక్కడ తనిఖీలు!

మేడ్చల్ జిల్లాలో రవాణాశాఖ అధికారులు టార్గెట్ రీచ్ కావడంపై ఫోకస్ పెట్టారు. MDCL జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతున్నారు. జిల్లా రవాణాశాఖ లక్ష్యం రూ.1,279.58 కోట్లు కాగా.. ఫిబ్రవరి 28 నాటికి కేవలం రూ.1,144.88 కోట్లు మాత్రమే ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. మార్చి 31నాటికి మేడ్చల్ జిల్లా నుంచి ఇంకా రూ.134.67 కోట్ల ఆదాయం సమకూరితే లక్ష్యం చేరుకుంటుంది.
Similar News
News December 8, 2025
జగిత్యాల జిల్లాలో చలి తీవ్రత

జగిత్యాల జిల్లాలో చలి తీవ్రత భారీగా పెరిగింది. కథలాపూర్లో 9.9℃, మన్నెగూడెం 10℃, గుల్లకోటలో 10℃ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వాతావరణ కేంద్రం ఈ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాఘవపేట 10.1, మల్లాపూర్, నేరెళ్ల 10.2, గోవిందారం 10.3, ఐలాపూర్ 10.4, సారంగాపూర్, రాయికల్, మేడిపల్లి 10.5, జగ్గసాగర్ 10.6, పెగడపల్లి, పొలాస, పూడూర్లో 10.7℃గా నమోదైంది. మిగతా ప్రాంతాల్లోనూ చలి తీవ్రంగానే ఉంది.
News December 8, 2025
రూ.7,887 కోట్లు అకౌంట్లలో జమ

TG: వరి సేకరణలో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ కొనసాగుతోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 41.6 లక్షల టన్నుల వరి కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. 8,401 PPCలలో 7.5 లక్షల మంది రైతులకు 48 గంటల్లోనే రూ.7,887 కోట్లు చెల్లించామని తెలిపారు. వరి కొనుగోళ్లలో 45% ఐకేపీ మహిళల భాగస్వామ్యంతో మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నామని మంత్రి పేర్కొన్నారు.
News December 8, 2025
వరంగల్: వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి చెందారు. MHBD(D)లోని అబ్బాయిపాలెంకు చెందిన సత్యం(60) కల్లు గీస్తున్న క్రమంలో ఈతచెట్టు పైనుంచి పడి మృతి చెందాడు. ఉనికిచర్ల సమీపంలో బైక్ కల్వర్టులోకి దూసుకెళ్లి ధర్మసాగర్(M)కి చెందిన యోగేశ్వర్ మృతి చెందాడు. NSPT(M) రాజేశ్వరరావుపల్లి <<18497665>>మాజీ సర్పంచ్<<>> యువరాజు అనారోగ్యంతో కన్నుమూశారు. వీధికుక్కల దాడిలో 8 గొర్రెలు మృతిచెందిన ఘటన కంబాలపల్లిలో జరిగింది.


