News February 2, 2025
MDK: అండర్-19 అమ్మాయిల టీమ్కు మంత్రి అభినందనలు

అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ గెలుపొందిన ఇండియా అమ్మాయిల టీమ్కు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శుభాకాంక్షలు తెలిపారు. ఆల్రౌండ్ ప్రదర్శనతో (3 వికెట్లు, 44 పరుగులు) జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించిన తెలంగాణ బిడ్డ గొంగడి త్రిషను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. టోర్నీలో త్రిష అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారని అన్నారు. ఆమె మరింత ఉన్నత స్థాయికి వెళ్లాలని మంత్రి కోరారు.
Similar News
News November 17, 2025
నర్సాపూర్: ‘బాల్య వివాహాలపై సమాచారం ఇవ్వండి’

బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని నర్సాపూర్ ఎస్సై రంజిత్ రెడ్డి హెచ్చరించారు. బాల్య వివాహాలపై ఆదివారం నర్సాపూర్లో ఫంక్షన్ హాల్ యజమానులు, ఫోటోగ్రాఫర్లు, పురోహితులు, బ్యాండ్ బాజా వారికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మైనర్ బాలబాలికలకు వివాహాలు జరిగితే అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. వివాహాలు చేసే ముందు వారి వయసు వివరాలను తప్పనిసరిగా సేకరించాలని తెలిపారు.
News November 16, 2025
కుటుంబానికి మూలశక్తి స్త్రీ: సత్యవాణి

భారతీయ కుటుంబానికి మూలశక్తి స్త్రీయే అని సామాజిక ఆధ్యాత్మికవేత్త భారతీయం సత్యవాణి అన్నారు. రామాయంపేట శిశు మందిర్లో సప్తశక్తి సంగం నిర్వహించారు. ప్రపంచ దేశాల్లో ఎక్కడలేని కుటుంబ వ్యవస్థ కేవలం మన భారతదేశంలోనే ఉందన్నారు. కుటుంబ బాధ్యతను అత్యంత సమర్థంగా నిర్వహించే శక్తి మహిళకే ఉంటుందని పేర్కొన్నారు. పిల్లలను ఉత్తములుగా తీర్చిదిద్దడంలో మహిళ పాత్రే అత్యంత కీలకమన్నారు.
News November 16, 2025
రేపటి నుంచి జిన్నింగ్ మిల్లులు బంద్: డీఎంఓ నాగరాజు

మెదక్ జిల్లాలో జిన్నింగ్(పత్తి) మిల్లుల బంద్ కారణంగా సోమవారం నుంచి కొనుగోళ్లు నిలిచిపోనున్నాయి. కావున సమస్య పరిష్కారం అయ్యేవరకు రైతులు తమ పత్తిని మిల్లులకు తీసుకురావద్దని జిల్లా మార్కెటింగ్ అధికారి కే.నాగరాజు సూచించారు. సీసీఐ వారు జిన్నింగ్ మిల్లుల కేటాయింపులో L1, L2 పద్ధతిని అనుసరించడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా మిల్లుల యాజమాన్యాలు సమ్మెకు దిగినట్లు ఆయన తెలిపారు.


