News March 15, 2025
MDK: అలర్ట్.. పిల్లలపై కన్నేసి ఉంచండి

మెదక్ జిల్లా వ్యాప్తంగా వేసవి తాపం నేపథ్యంలో నేటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు తరగతులు ఉంటాయి. ఒంటిపూట బడులు అంటే పిల్లలకు సరదా.. చెరువుల్లో, నీటి వనరుల వద్దకు వెళ్తుంటారు. చిన్నారులు నీట మునిగి మృత్యువాత పడిన ఘటనలు ఎన్నో జరిగాయి. చెరువులు, కుంటలు, బావులు నీటితో నిండి ఉన్నాయి. పిల్లల మీద పెద్దలు ఓ కన్నేసి ఉంచండి. SHARE IT..
Similar News
News March 15, 2025
మెదక్: ఒక్కరోజు రాష్ట్ర స్థాయి వర్క్ షాప్

మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 22న వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో హెర్బేరియం తయారీ, నిలువ చేయు విధానం అనే అంశంపై ఒక్కరోజు రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె. హుస్సేన్ తెలిపారు. రాష్ట్రీయ ఉచిత ఉచితార్ శిక్షాభియన్ వారి ఆర్థిక సహకారంతో ఈ కార్యశాలకు సంబంధించిన ప్రచార పత్రాన్ని కళాశాలలో ఆవిష్కరణ చేశారు.
News March 15, 2025
మెదక్: రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆర్డీఓ సమావేశం

మెదక్ ఆర్డీవో రమాదేవి తన కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఫారం-6, 8ల గురించి రాజకీయ పార్టీ ప్రతినిధులకు అవగాహన కల్పించారు. ఓటరు జాబితా నిరంతర నమోదు, బూత్ స్థాయి ప్రతినిధుల నియామకం గురించి చర్చించారు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ పార్టీల ప్రతినిధులు లేవనెత్తిన సందేహాలకు అధికారులు సమాధానం ఇచ్చారు. తహసీల్దార్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
News March 15, 2025
రేపు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసనలు: ఆంజనేయులు

రేపు జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ పిలుపునిచ్చారు. నర్సాపూర్లో ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో స్పీకర్ పట్ల ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని కార్యకర్తలను కోరారు.