News July 12, 2024
MDK: ఉద్యోగాల పేరిట ఘరానా మోసం

ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి జహీరాబాద్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ లక్షలు కాజేసింది. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్న విషయాన్ని తెలుసుకుంది. స్టాఫ్ నర్సు, క్లర్క్ జాబ్ అంటూ నమ్మించి 28 మంది నుంచి రూ.2 లక్షల చొప్పున వసులు చేసి ఫోర్జరీ సంతకాలతో నకిలీ జాబ్ ఆర్డర్లు ఇచ్చింది. పోస్టింగ్ ఆర్డర్లు తీసుకొని ఆసుపత్రికి వెళ్లగా అసలు విషయం బయట పడింది.
Similar News
News December 17, 2025
మెదక్: ఈనెల 21న జాతీయ లోక్ అదాలత్

ఈ నెల 21న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి. నీలిమ పిలుపునిచ్చారు. న్యాయమూర్తులతో కలిసి ఆమె మాట్లాడారు. ఎక్కువ సంఖ్యలో రాజీ పడదగ్గ కేసులను పరిష్కరించి, కక్షిదారులకు సత్వర న్యాయం అందించేలా చొరవ చూపాలని సూచించారు. అందరూ సమన్వయంతో పనిచేసి లోక్ అదాలత్ ద్వారా గరిష్ఠ స్థాయిలో కేసుల పరిష్కారానికి కృషి చేయాలన్నారు.
News December 17, 2025
నర్సాపూర్ ఎమ్మెల్యే స్వగ్రామంలో కాంగ్రెస్ విజయం

శివంపేట మండలంలో గోమారం సర్పంచిగా కుమ్మరి హిమవతి ఆంజనేయులు విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి హిమవతి సమీప ప్రత్యర్థిపై గెలుపొందారు. దీంతో సర్పంచ్ అనుచరులు గ్రామంలో టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. కాగా, గోమారం నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి స్వగ్రామం.
News December 17, 2025
మెదక్: మండలాల వారీగా పోలింగ్ శాతం

మెదక్ జిల్లాలో మూడో విడత 7 మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగగా 90.68 శాతం ఓటింగ్ జరిగినట్లు జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య తెలిపారు. ఒంటిగంట తర్వాత నమోదైన ఓటింగ్ శాతం.. చిలపిచెడు మండలంలో 90.02, కౌడిపల్లి 90.80, కుల్చారం 89.20, మాసాయిపేట 88.90, నర్సాపూర్ 93.38, శివంపేట 92.57, వెల్దుర్తి 87.62 శాతం ఓటింగ్ జరిగినట్లు అధికారులు తెలిపారు.


