News March 6, 2025

MDK: గెలిచినోళ్ల సంబరాలు.. ఓడినోళ్ల సమాలోచనలు

image

KNR-ADB-NZB-MDK పట్టభద్రుల MLC ఎన్నికల్లో BJP అభ్యర్థి అంజిరెడ్డి 5,106 ఓట్ల మెజార్టీతో గెలవగా ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. 2వ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి, 3వ స్థానంలో BSPఅభ్యర్థి ప్రసన్న హరికృష్ణ నిలిచారు. ఎలా ఓడిపోయామని అటు నరేందర్ రెడ్డి, ఇటు హరికృష్ణ శ్రేణులతో సమాలోచనలు చేస్తున్నారు. చెల్లని ఓట్లు 28,686 రాగా తమ ఓటమికి ఇదే ప్రధాన కారణమని ఆ పార్టీల నేతలు అంటున్నారు.

Similar News

News March 24, 2025

ఎర్రగుంట్ల: మోసాల్లో ఇదో కొత్త రకం

image

బంధువని చెప్పి మాటల్లో పెట్టి మోసంచేసే కేటుగాడిని ఎర్రగుంట్ల పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే.. ఖాజీపేటకు చెందిన ఖాసీంపీరా చెడు వ్యసనాలకు బానిసై అప్పులుచేసి, అవి తీర్చడానికి అడ్డదారులు ఎంచుకున్నాడు. ఈనెల 9న ఎర్రగుంట్లలో మహబూబీ అనే వృద్ధురాలిని బంధువని నమ్మించాడు. ‘తన కూతురి పెళ్లికి రావాలని, మీ చేతికి ఉన్న ఉంగరం లాంటిది చేయిస్తానని చెప్పి, ఇవ్వాలని తీసుకొని’ ఉడాయించాడు.

News March 24, 2025

HYD MMTSలో యువతిపై అత్యాచారయత్నం

image

సికింద్రాబాద్ TO మేడ్చల్ MMTSలో ఓ యువతిపై దుండగుడు అత్యాచారానికి యత్నించాడు. యువతి ఒంటరిగా ఉన్న సమయంలో ఆమెపై అత్యాచారానికి యత్నించగా.. కదులుతున్న ట్రెయిన్‌లో నుంచి ఆ యువతి దూకేసింది. తీవ్రగాయాలైన ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 24, 2025

అనకాపల్లి: ఇంటర్ కాలేజీలకు హెచ్చరిక 

image

నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియ చేపడితే చర్యలు తీసుకుంటామని అనకాపల్లి జిల్లా ఇంటర్ విద్యాధికారిణి బి. సుజాత హెచ్చరించారు. ఇంటర్మీడియట్ బోర్డు ప్రవేశాల ప్రకటన జారీచేసిన తర్వాతే షెడ్యూల్ ప్రకారం ఇంటర్ మొదటి ఏడాది అడ్మిషన్లు చేపట్టాలన్నారు. ఎలాంటి ముందస్తు అడ్మిషన్లు చేపట్టరాదన్నారు.

error: Content is protected !!