News August 22, 2024
MDK: గ్రామ పంచాయతీ ఎన్నికలు.. సెప్టెంబర్ 21న ఓటర్ల తుది జాబితా

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు జోరందుకున్నాయి. వార్డులు, గ్రామపంచాయతీల వారీగా ఓటర్ల జాబితా షెడ్యూల్ను విడుదల చేశారు. ఓటర్ల తుది జాబితాను సెప్టెంబర్ 21న విడుదల చేయనున్నారు. ఓటర్ల జాబితాపై బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారధి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఓటర్ల జాబితా షెడ్యూల్ ప్రకారం.. సెప్టెంబర్ 6న ఓటర్ల జాబితా ముసాయిదాను గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ఉంచుతారు.
Similar News
News December 8, 2025
మెదక్: ‘పెండింగ్ బకాయిల జాబితా విడుదల చేయాలి’

ఆర్థిక శాఖ అధికారులు ఉద్యోగులకు నవంబర్ నెల విడుదల చేసిన రూ.707.30 కోట్ల ఉద్యోగులకు రావలసిన పెండింగ్ బకాయిల టోకెన్ నెంబర్ల జాబితా విడుదల చేయాలని టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ డిమాండ్ చేశారు. సోమవారం ఉద్యోగులతో కలిసి మాట్లాడారు. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క నవంబర్ నెలకు సంబంధించిన రూ.707. 30 కోట్ల ఉద్యోగుల బకాయిలు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారన్నారు.
News December 8, 2025
మెదక్: రూ.15 లక్షల విలువైన 110 మొబైల్ ఫోన్ల రికవరీ: ఎస్పీ

CEIR పోర్టల్ ద్వారా రూ.15 లక్షల విలువైన 110 మొబైల్ ఫోన్ల రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు ఎస్పీ శ్రీనివాస రావు తెలిపారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు పోగొట్టుకున్న 1,734 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని బాధితులకు అందించామని వివరించారు. కోల్పోయిన ఫోన్లు తిరిగి రావడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేస్తూ జిల్లా పోలీస్ శాఖకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ మహేందర్ పాల్గొన్నారు.
News December 8, 2025
కుకుట్లపల్లిలో అన్నదమ్ముల మధ్య సవాల్

కౌడిపల్లి మండలంలో కూకట్లపల్లి పంచాయతీలో సొంత అన్నదమ్ముల మధ్య పోరు జరుగుతోంది. ఎస్సీ జనరల్కు రిజర్వ్ కావడంతో సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ మద్దతుదారుగా నీరుడి అశోక్ బరిలో నిలవగా అతని తమ్ముడు నీరుడి కుమార్ భారాస మద్దతుతో పోటీలో ఉన్నారు. రెండు ప్రధాన పార్టీలు వారికి మద్దతు తెలపడంతో అన్నాదమ్ముల మధ్య పోటీ రసవత్తరంగా మారింది. ఓటర్లు ఎవరిని ఆదరిస్తారో చూడాలి మరి.


