News August 3, 2024
MDK: చేప.. చెరువుకు చేరేనా?

చేప పిల్లల పంపిణీ పథకం ఈ ఏడాది ఆలస్యమయ్యేల కనిపిస్తుంది. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మత్యశాఖ ఆఫీస్లో బిడ్లకు సంబంధించి టెండరు బాక్సు తెరవగా ఒక్కరూ టెండర్లో పాల్గొనకపోవడంతో అధికారులు అవాక్కయ్యారు. జిల్లాలో మొత్తం 1,160 చెరువులు, కుంటలు ఉన్నాయి. 227 మత్స సహాకార సంఘాలు ఉండగా వీటిలో 11,013 మంది సభ్యులు ఉన్నారు. ఈ ఏడు 3.41 కోట్ల చేప పిల్లలు వదలాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
Similar News
News December 11, 2025
మెదక్: ఎన్నికల సాధారణ పరిశీలకురాలు సందర్శన

మెదక్ జిల్లా మొదటి విడతలో పంచాయతీ ఎన్నికల సందర్బంగా పెద్ద శంకరంపేట, రేగోడు మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను ఎన్నికల సాధారణ పరిశీలకురాలు భారతి లక్పతి నాయక్ సందర్శించారు. ఎన్నికల సంఘం ఆదేశాలు, సూచనల మేరకు అధికారులు, సిబ్బంది పనిచేయాలని సూచించారు. మొదటి విడత మాదిరిగానే రాబోయే రెండు, మూడు విడతల్లో పారదర్శకంగా పనిచేయాలన్నారు.
News December 11, 2025
మెదక్: ‘ఉపాధ్యాయులకు ఓడి అవకాశం కల్పించాలి’

మెదక్ జిల్లా విద్యాధికారిని గురువారం ఉపాధ్యాయ సంఘం నాయకులు కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉపాధ్యాయులందరికీ ఎన్నికలు జరిగిన మరుసటి రోజు ఓడి సదుపాయం కల్పించాలని మెదక్ జిల్లా విద్యాధికారి విజయకు ఉపాధ్యాయ సంఘాలు వినతి పత్రం సమర్పించారు. ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో ఉన్నవారికి సమస్యలు పరిష్కారం కోసం వినతి పత్రం సమర్పించినట్టు తెలిపారు.
News December 11, 2025
మెదక్: 88.46% ఓటింగ్గా తేల్చిన అధికారులు

మెదక్ జిల్లాలో ఆరు పంచాయతీలలో జరిగిన ఎన్నికలలో 88.46 శాతం ఓట్లు పోలైనట్లు జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య తెలిపారు. 1,63,148 ఓటర్లు ఉండగా 1,44,323 ఓట్లు పోలైనట్లు వివరించారు. ఎన్నికలలో 89.68% పురుషులు, 87.34 శాతం మహిళలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో 69,933 మంది పురుషులు, 74 వేల 388 మంది మహిళలు, ఇద్దరు ఇతరులు ఓటు హక్కు వినియోగించుకున్నట్లు పేర్కొన్నారు.


