News February 25, 2025
MDK: దేశానికి అన్నం పెట్టే రైతన్నలతో కన్నీళ్లు పెట్టిస్తున్నారు: హరీశ్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా కష్టాలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు విమర్శలు గుప్పించారు. మొన్న మహబూబాబాద్ జిల్లాలో యూరియా పంపిణీ కోసం పోలీసులు టోకెన్లు జారీ చేస్తే.. నేడు జగిత్యాలలో రైతులు పాస్ బుక్కులు, ఆధార్ కార్డులు క్యూలో పెట్టిన పరిస్థితి నెలకొందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలోని రైతుల కన్నీళ్ల కడగండ్లను కాంగ్రెస్ సర్కార్ పునరావృతం చేస్తున్నదని మండిపడ్డారు.
Similar News
News December 17, 2025
11AM పోలింగ్ అప్డేట్.. ఖమ్మం జిల్లాలో 60.84%

ఖమ్మం జిల్లాలో తుది విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 7 మండలాలు కలిపి ఉ.11 గంటల వరకు 60.84% పోలింగ్ నమోదైందని అధికారులు తెలిపారు. ☆ ఏన్కూరు-65.63%, ☆ కల్లూరు- 68.41%,☆ పెనుబల్లి-55.83%, ☆ సత్తుపల్లి- 57.73%, ☆ సింగరేణి-60.09%, ☆ తల్లాడ- 60.04%, ☆ వేంసూరు- 61.69% ◇ 7 మండలాలు కలిపి ఇప్పటి వరకు 1,48,616 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
News December 17, 2025
సిద్దిపేట జిల్లాలో 11AM@60.15% పోలింగ్

సిద్దిపేట జిల్లాలో కొనసాగుతున్న మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ ఉదయం 11 గంటలకు 60.15 % నమోదైంది. అక్కన్నపేట-62.62%, చేర్యాల-57.62%, ధూల్మిట్ట-63.39%, హుస్నాబాద్-58.22%, కోహెడ-59.72%, కొమురవెల్లి-61.61%, కొండపాక-62.89%, కుకునూరుపల్లి-66.72%, మద్దూరు-49.93% పోలింగ్ నమోదైనట్లు జిల్లా అధికారులు వెల్లడించారు.
News December 17, 2025
టీడీపీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఇతనే.!

టీడీపీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శిగా మంత్రి ఫరూక్ కుమారుడు ఎన్.ఎం.డీ ఫిరోజ్ నియమితులయ్యారు. ఆయన మూడో సారి ఈ పదవిని చేపట్టారని నాయకులు తెలిపారు. అధ్యక్ష స్థానం కోసం నామినేషన్ వేశారు. అయితే ఆ పదవి ధర్మవరం సుబ్బారెడ్డికి వెళ్లడంతో ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.


