News February 1, 2025

MDK: యువతితో అసభ్య ప్రవర్తన.. మూడేళ్ల జైలు శిక్ష: ఎస్పీ

image

మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామానికి చెందిన చంద్రలింగం అదే గ్రామానికి చెందిన అమ్మాయిని చేతి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించడంతో అతడిపై కేసు నమోదైనట్లు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. అతనికి మూడేళ్ల జైలుశిక్ష, రూ.21 వేల జరిమానా విధించినట్లు చెప్పారు. కేసు పూర్తిగా విచారణ చేసి మెదక్ జిల్లా ప్రధాన సెషన్స్ జడ్జి లక్ష్మీ శారద తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ పేర్కొన్నారు.

Similar News

News February 13, 2025

జగిత్యాల: మాటలకే పరిమితం కావొద్దు: MLC జీవన్ రెడ్డి

image

రాజకీయ పార్టీ నాయకులు మాటలకు పరిమితంగా కాకూడదని, చేతల్లో నిరూపించాలని కాంగ్రెస్ MLC జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాలలోని ఇందిరా భవన్‌లో ప్రభుత్వ విప్ లక్ష్మణ్‌తో కలిసి గురువారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. బండి సంజయ్ మత విద్వేషాలను రెచ్చగొట్టే పని చేయకుండా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ వచ్చేలా సహకరించాలని కోరారు. రిజర్వేషన్లను మతంతో ముడిపెట్టడం సరికాదన్నారు.

News February 13, 2025

NRPT: మైనర్లను అదుపులోకి తీసుకున్న అధికారులు

image

నారాయణపేట ఆర్టీసీ బస్టాండ్, మినీ స్టేడియం మైదానంలో మైనర్ పిల్లలు యాచిస్తున్నారని అందిన సమాచారం మేరకు చైల్డ్ హెల్ప్ లైన్ అధికారులు చిన్నారులను అదుపులోకి తీసుకున్నారని జిల్లా సమన్వయకర్త నర్సింలు తెలిపారు. ఆరుగురు పిల్లలను చిల్డ్రన్స్ హోమ్‌కు తరలించామని చెప్పారు. పిల్లల పేరెంట్స్‌కు కౌన్సెలింగ్ నిర్వహించి అప్పగిస్తామని చెప్పారు. బాల కార్మికులను పనిలో పెట్టుకోవడం చట్టరీత్య నేరమన్నారు.  

News February 13, 2025

తూ.గో: గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 35 మంది

image

గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 35 మంది పోటీలో నిలిచినట్లు ఏలూరు కలెక్టర్ వెట్రీ సెల్వీ గురువారం తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు చివరి రోజు కావడంతో ఎనిమిది మంది నామినేషన్లు విత్ డ్రా చేసుకున్నారన్నారు. మొత్తం 54 మంది నామినేషన్ వేయగా 11 మంది నామినేషన్లను తిరస్కరించగా, ఎనిమిది మంది విత్ డ్రా చేసుకున్నారని విత్ డ్రా గడువు ముగిసే సమయానికి 35 మంది పోటీలో ఉన్నారని తెలిపారు.

error: Content is protected !!