News August 15, 2024

MDK: రాఖీ పౌర్ణమికి ప్రత్యేక బస్సులు

image

రాఖీ పౌర్ణమి సందర్భంగా ఈ నెల 16-21 తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు RTC ప్రాంతీయ మేనేజర్ ప్రభులత పేర్కొన్నారు. బుధవారం ఉమ్మడి మెదక్ జిల్లా డిపో మేజేజర్లతో సమీక్ష నిర్వహించారు. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా బస్టాండ్లలో ఎప్పటికప్పుడు రద్దీ పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈనెల 16న 32, 17న 35, 18న 55, 19న 70, 20న 45, 21న 28 కలిపి మొత్తం 265 బస్సుల్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

Similar News

News November 5, 2025

రైతులు మద్దతు ధర పొందేలా కృషి చేయండి: కలెక్టర్

image

పత్తి రైతులు మద్దతు ధర పొందేలా కృషి చేయాలని అధికారులను కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. మంగళవారం టేక్మాల్ రైతు వేదికలో పెద్దశంకరంపేట డివిజన్ వ్యవసాయ అధికారులతో కాటన్ కాపాస్ యాప్‌పై ఆయన సమీక్షించారు. డివిజన్ పరిధిలో 34,903 ఎకరాలలో పత్తి సాగు చేసిన రైతులకు యాప్ గురించి అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు.

News November 4, 2025

చిన్నశంకరంపేట: ‘బాల్య వివాహాలు చట్ట విరుద్ధం’

image

చిన్నశంకరంపేట మండలం వెంకట్రావుపల్లిలో విలేజ్ లెవల్ ఛైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ కార్యదర్శి పద్మ, విజన్ ఎన్జీఓ ఆర్గనైజర్ యాదగిరి బాల్య వివాహాల వల్ల కలిగే నష్టాలను వివరించారు. 18 ఏళ్లలోపు బాలిక, 21 ఏళ్లలోపు బాలురకు వివాహం చట్ట విరుద్దమన్నారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ సభ్యులంతా కలిసి బాల్య వివాహాలు చేయమని తీర్మానం చేసి ప్రతిజ్ఞ చేశారు.

News November 4, 2025

కౌడిపల్లి: ‘విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి’

image

విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఫుడ్ కమిషన్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, సభ్యులు స్పష్టం చేశారు. కౌడిపల్లి ఆశ్రమ పాఠశాల తనిఖీ చేశారు. విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. తల్లిదండ్రుల సమావేశం నిర్వహించాలన్నారు. విద్యార్థులకు మాసహారం, చికెన్ పెట్టడం లేదని చెప్పారని, ప్రభుత్వం విద్యార్థులకు అన్ని విధాలుగా నాణ్యమైన బోజనానికి కట్టుబడి ఉందన్నారు.