News May 5, 2024
MDK: రికార్డ్.. 44.5 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత

మెతుకు సీమ భగ భగమంటోంది. రోజురోజుకు భానుడు తాపానికి మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో జనం జలు హడలిపోతున్నారు. రేగోడ్లో శనివారం రికార్డు స్థాయిలో 45.1 డిగ్రీల అత్యధిక పగటి ఉష్ణోగ్రత నమోదైంది. సాధారణం కంటే 4 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 10 రోజులుగా ఎండ పెరుగుతూ వచ్చింది. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిన్న వడదెబ్బతో ఒకరు చనిపోయిన విషయం తెలిసిందే.
Similar News
News December 20, 2025
మెదక్: హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే దరఖాస్తుల స్వీకరణ: కలెక్టర్

22న సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంపై కలెక్టర్ మాట్లాడుతూ.. సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారాలు, విపత్తులను ఎదుర్కొనే విషయంలో మాక్ ఎక్సర్సైజ్ నిర్వహణలో పాల్గొంటున్న కారణంగా ఆయా శాఖల అధికారులు ప్రజావాణికి అందుబాటులో ఉండరన్నారు.
News December 20, 2025
MDK: విపత్తులపై అప్రమత్తతే ప్రధానం: అదనపు కలెక్టర్ నగేష్

విపత్తులపై ప్రజలకు అవగాహన కల్పించడం అత్యంత ముఖ్యమని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ తెలిపారు. ముందస్తు అప్రమత్తతతో ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించవచ్చని అన్నారు. ఈ నెల 22న హవేలీ ఘనపూర్ మండలం దూప్ సింగ్ తండాలో విపత్తుల నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్ను విజయవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. విపత్తుల సమయంలో పారిశుధ్య, వైద్య సేవలు కీలకమని పేర్కొన్నారు.
News December 20, 2025
మెదక్లో జాతీయ మెగా లోక్ అదాలత్ ఏర్పాట్లపై సమీక్ష

మెదక్ జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాస రావు జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమాని మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా రేపు నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ ఏర్పాట్లు, లోక్ అదాలత్లో పరిష్కారానికి వచ్చే కేసుల వివరాలపై చర్చ జరిగింది. అనుకూల వాతావరణంలో కేసులను పరిష్కరించడానికి న్యాయస్థానం, పోలీస్ శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని వారు పేర్కొన్నారు.


