News February 10, 2025

MDK: రేపు ముసాయిదా జాబితా విడుదల

image

మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు అధికారులు సమాయత్తమవుతున్నారు. మొదట మండల, జిల్లా పరిషత్ ఎన్నికలే నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతుండటంతో అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. MDK జిల్లాలో 21 ZPTCలు, 190 MPTC స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాను విడుదల చేయనున్నారు.

Similar News

News February 11, 2025

మెదక్: ‘ఇంటర్‌లో 100% ఫలితాలు సాధించాలి’

image

 ఇంటర్‌లో 100% ఫలితాలు సాధించాలని మెదక్ జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి మాధవి అన్నారు. రామాయంపేట జూనియర్ కళాశాలను మంగళవారం ఆమె తనిఖీ చేశారు. అక్కడ జరుగుతున్న ప్రాక్టికల్ విధానాన్ని పరిశీలించారు. అనంతరం లెక్చరర్లకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రతి లెక్చరర్ సబ్జెక్టుపై విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించాలని తెలిపారు. ఈ విషయంలో ఎవరైనా నిర్లక్ష్యం చేస్తే శాఖ పరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News February 11, 2025

ఓయూ దూర విద్య ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల

image

ఉస్మానియా యూనివర్సిటీ దూర విద్యా కేంద్రమైన ప్రొఫెసర్ జి.రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ (పీజీఆర్ఆర్సీడీఈ)లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఏటా రెండు దఫాలుగా ప్రవేశాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా రెండో దఫా మార్చి 31వ తేదీ వరకు ప్రవేశాలు నిర్వహిస్తున్నామన్నారు. వివరాలకు 040-27097177, 040-27098350 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

News February 11, 2025

మెదక్: ప్రముఖ వ్యాపారి గుండెపోటుతో మృతి

image

మెదక్ పట్టణంలో ప్రముఖ వ్యాపారి మల్లికార్జున రమేష్ (58) మంగళవారం ఉదయం గుండెపోటుతో మరణించాడు. రమేశ్‌కు భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. ఆయన మరణం పట్ల మున్సిపల్ మాజీ ఛైర్మన్లు చంద్రపాల్, బట్టి జగపతి, మల్లికార్జున గౌడ్, ఏఎంసీ మాజీ ఛైర్మన్ కృష్ణారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. రమేశ్ మృతి తీరిన లోటు అని అన్నారు.

error: Content is protected !!