News August 27, 2024
MDK: విజృంభిస్తోన్న విష జ్వరాలు

ఉమ్మడి మెదక్ జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ జిల్లాలోని ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. జిల్లాలో ఇప్పటికే డెంగ్యూతో ముగ్గురు మృతిచెందారు. 2 నెలల్లో ఇప్పటివరకు సంగారెడ్డిలో 186, మెదక్లో 26, సిద్దిపేటలో 56 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. గ్రామాలు, తండాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. పరిశుభ్రత పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. BE CAREFULL
SHARE IT
Similar News
News October 15, 2025
MDK: ‘రూల్స్ పాటించకపోతే చర్యలే’

ప్రతి దీపావళికి జిల్లాలో 250 వరకు టపాసుల దుకాణాలు ఏర్పాటు చేస్తారు. మెదర్, రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ తదితర ఏరియాల్లో భారీగా వెలుస్తాయి. అయితే దుకాణాల నిర్వాహకులు ఇష్టానుసారంగా ఏర్పాట్లు చేస్తున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలో టపాసుల షాపులను నిబంధనల మేరకే ఏర్పాటు చేసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు.
News October 15, 2025
రామాయంపేట: ఇంట్లో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య

ఇంట్లో వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన రామాయంపేట మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండల పరిధిలోని ఝాన్సీ లింగాపూర్ గ్రామపంచాయతీ పరిధి సదాశివనగర్ తండాలో మంగళవారం రాత్రి మున్యా(36) తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలుసుకున్న రామాయంపేట ఎస్సై బాలరాజు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
News October 15, 2025
మెదక్: నేటి నుంచి 1,52,524 పశువులకు టీకాలు

పశువులకు వ్యాధి నిరోధక టీకా కార్యక్రమం విజయవంతం చేయాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటయ్య కోరారు. మెదక్ జిల్లా వ్యాప్తంగా 1,52,524 పశువులు ఉండగా అందులో 48,909 ఆవులు, 1,03,615 గేదెలు ఉన్నాయన్నారు. జిల్లా వ్యాప్తంగా 46 బృందాలుగా ఏర్పడి వ్యాధి నిరోధక టీకా కార్యక్రమాన్ని ఈ నెల 15 నుంచి వచ్చే నెల 14 వరకు అన్ని గ్రామాల్లో పశువులకు వ్యాధి నిరోధక టీకాలు వేస్తున్నామన్నారు.