News September 14, 2024
MDK: విషాదం.. రక్త కణాలు తగ్గి చిన్నారి మృతి

మెదక్ జిల్లాలో విషాదం నెలకొంది. రక్త కణాలు తగ్గిపోవడంతో ఓ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన నర్సాపూర్లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. కొన్ని రోజుల నుంచి సహస్ర(7) తీవ్ర జ్వరంతో బాధపడుతోంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు పాపను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో శుక్రవారం రాత్రి చనిపోయింది. చిన్నారి మృతితో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది.
Similar News
News November 18, 2025
మెదక్: ఈ మండలాల్లో రిపోర్టర్లు కావలెను..!

మెదక్ జిల్లా నర్సాపూర్, శివంపేట, వెల్దూర్తి, మాసాయిపేట, కొల్చారం, కౌడిపల్లి, చిలిప్ చెడ్, చేగుంట మండలాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ లింకుపై <
News November 18, 2025
మెదక్: ఈ మండలాల్లో రిపోర్టర్లు కావలెను..!

మెదక్ జిల్లా నర్సాపూర్, శివంపేట, వెల్దూర్తి, మాసాయిపేట, కొల్చారం, కౌడిపల్లి, చిలిప్ చెడ్, చేగుంట మండలాల నుంచి రిపోర్టర్ల కోసం Way2News దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వారు మాత్రమే ఈ లింకుపై <
News November 18, 2025
నిషేధిత ఔషధాలు విక్రయిస్తే చర్యలు: డ్రగ్ ఇన్స్పెక్టర్

నిషేధిత ఔషధాలను విక్రయించవద్దని, ఔషధాల రికార్డులను సక్రమంగా నిర్వహించాలని జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ చంద్రకళ మెడికల్ షాపు యజమానులను ఆదేశించారు. రామాయంపేటలో సోమవారం నాలుగు ఔషధ దుకాణాలలో తనిఖీలు నిర్వహించారు. జీఎస్టీ స్లాబ్ రేట్ ప్రకారం ఔషధాలు విక్రయించాలని సూచించారు. డాక్టర్ మందుల చీటీ లేకుండా ఔషధాలు విక్రయించవద్దని, నిషేధిత ఔషధాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


