News January 28, 2025
MDK: వేర్వేరు ఘటనల్లో ఐదుగురి మృతి

ఉమ్మడి జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ఐదుగురు మృతి చెందారు. వివరాలు.. గుమ్మడిదల(M)లో పాఠశాల బస్సు ఢీకొని సంతోష్ (7) అక్కడికక్కడే మృతి చెందగా.. హత్నూర(M)లో కామారెడ్డి జిల్లా వాసి నారాయణ(45)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. గజ్వేల్లో బైక్ డివైడర్ను ఢీకొని మైలారానికి చెందిన స్వామి(26), సంగుపల్లికి చెందిన సదానందం(27) మృతి చెందారు. దుబ్బాకలో అప్పుల బాధతో శేర్వాణి మహేశ్(38) ఆత్మహత్య చేసుకున్నాడు.
Similar News
News December 10, 2025
అమరావతి నిర్మాణం ఆగకుండా మెటీరియల్!

AP: అమరావతిలో నిర్మాణ పనులు ఆగకుండా మెటీరియల్ సరఫరా చేసే నిమిత్తం 4 జిల్లాల అధికారులకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. గ్రావెల్, రోడ్ మెటల్, మట్టి, ఇసుక సరఫరాలో సమస్యలున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కలెక్టర్ అధ్యక్షతన ఈ అధికారులు కమిటీగా ఏర్పడి మెటీరియల్ డిమాండ్, సరఫరా వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటారు. సరఫరాలో అడ్డంకులను తొలగించడం, అనుమతులు ఇప్పించడంలో కమిటీ బాధ్యత వహిస్తుంది.
News December 10, 2025
పురుగు మందుల కొనుగోలు- జాగ్రత్తలు

పంటకు ఆశించినది తెగులో, పురుగో గుర్తించి.. వ్యవసాయ అధికారుల సిఫార్సు మేరకు నమ్మకమైన డీలర్ల నుంచి పురుగు మందులను కొనాలి. డీలర్ నుంచి మందు వివరాల రసీదును తప్పనిసరిగా తీసుకోవాలి. 2,3 రకాల మందులు అందుబాటులో ఉంటే విషపూరిత గుణాన్ని బట్టి తక్కువ హాని కలిగించే మందును ఎన్నుకోవాలి. ప్యాకెట్పై ఆ మందును ఏ పంటలో ఏ పురుగు, తెగులు కోసం సిఫార్సు చేశారో చూసి తీసుకోవాలి. ప్యాకింగ్, గడువు తేదీని తప్పక చూడాలి.
News December 10, 2025
TPT: ర్యాపిడో డ్రైవర్ అత్యాచారం.. ఫోన్పే చేయడంతోనే!

తిరుపతిలో ర్యాపిడో డ్రైవర్ సాయికుమార్ ఓ బాలికను అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ర్యాపిడో బుక్ చేసినప్పుడు ఆ బాలిక ఫోన్ పే ద్వారా నగదు చెల్లించింది. ఆ నంబర్తో బాలికకు కాల్ చేసి ప్రేమిస్తున్నానని చెప్పగా ఆమె నిరాకరించింది. తర్వాత సాయి కుమార్ తన అక్కతో ఫోన్ మాట్లాడించాడు. ఫ్రెండ్స్గా ఉందామని.. ఏ అవసరం వచ్చినా కాల్ చేయడమన్నాడు. దీంతో బాలిక సాయం అడిగితే తీసుకెళ్లి అత్యాచారం చేశాడని సమాచారం.


