News December 17, 2025
MDK: ఎన్నికల్లో ముగ్గురు బాల్య మిత్రులు గెలుపు

తూప్రాన్ మండలం ఘనాపూర్ జీపీలో బాల్యమిత్రులు వార్డు సభ్యులుగా విజయం సాధించారు. ఎస్ఎస్సీ బాల్య మిత్రులైన సురేష్, వేణు, సయ్యద్ అన్వర్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని నిశ్చయించుకున్నారు. వేణు, సురేష్లకు వార్డులలో సభ్యులుగా పోటీ చేయడానికి రిజర్వేషన్ అనుకూలించింది. అన్వర్కు అనుకూలించకపోవడంతో తల్లి నజ్మా బేగంను ఎన్నికలలో నిలిపారు. సురేష్, వేణు, నజ్మా బేగం, (అన్వర్ తల్లి) వార్డు సభ్యులుగా గెలిచారు.
Similar News
News December 28, 2025
‘మేకిన్ మల్కాపూర్’ 380 వారాలుగా స్వచ్ఛభారత్

మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని ఆదర్శ గ్రామమైన మల్కాపూర్లో 380 వారాలుగా స్వచ్ఛభారత్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ‘మేకిన్ మల్కాపూర్’ నినాదంతో యువత గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించనున్న గ్రామంగా ఎంపిక కావడంతో గ్రామస్థులు మరింత శ్రమిస్తున్నారు. సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, పంచాయతీ ప్రతినిధులు, అధికారులు కలిసి శుభ్రత పనులను చేపట్టారు.
News December 28, 2025
పార్లమెంట్ ప్రోగ్రాంలో పాల్గొన్న మెదక్ విద్యార్ధి

పార్లమెంట్లో నిర్వహించిన కార్యక్రమంలో మెదక్ జిల్లా విద్యార్ధి పాల్గొన్నారు. కేంద్ర విద్యా శాఖ(NCERT) ఢిల్లీచే ఎంపిక చేసి పార్లమెంటు కార్యక్రమంలో పాల్గొనడానికి పాపన్నపేట మండలం లింగాయపల్లి చీకోడ్ విద్యార్థి ఏ.శివ చైతన్య, ఉపాధ్యాయుడు ఆర్.కిషన్ ప్రసాద్ను ఆహ్వానించారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రసంగించగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్ల.. విద్యార్థి, ఉపాధ్యాయుడిని అభినందించారు.
News December 28, 2025
RMPT: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న యువకుడు శనివారం కన్నుమూశాడు. మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. RMPT మండలంలోని ఆర్.వెంకటాపూర్ గ్రామానికి చెందిన గుర్రం తేజ గౌడ్ మూడు నెలల క్రితం కర్నాల్పల్లి వద్ద జరిగిన ప్రమాదంలో తలకి తీవ్ర గాయాలై కోమాలోకి వెళ్ళాడు. అప్పటి నుంచి ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతుండగా శనివారం పరిస్థితి విషమించి మృతి చెందాడు.


