News August 20, 2025

MDK: ఎల్లలు దాటినా.. ఏడుపాయల కీర్తి

image

మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గమ్మ ప్రధాన ఆలయం 7వ రోజు బుధవారం సైతం జలదిగ్బంధంలోనే చిక్కుకుంది. భారీ వర్షాలతో వనదుర్గా ప్రాజెక్ట్ పొంగి పొర్లుతుంది. ఉదయం రాజగోపురంలో ఉత్సవ విగ్రహానికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా 1965-1966లో ఈ ఆలయం దేవాదాయ శాఖ అధీనంలోకి వెళ్లింది. దేశంలో రెండో వనదుర్గమ్మ ఆలయం ఏడుపాయల కావడం విశేషం. దీంతో ఏడుపాయల కీర్తి ఎల్లలు దాటింది.

Similar News

News August 20, 2025

మెదక్: తగ్గిన వర్షం.. కురిసింది 3 సెంమీలలోపే

image

మెదక్ జిల్లాలో వర్షం కాస్త తగ్గుముఖం పట్టింది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా పాపన్నపేట మండలం లింగాయపల్లిలో 29.5 మిమీల వర్షపాతం నమోదయింది. రాజుపల్లిలో 27.5, చిన్న శంకరంపేటలో 25, మాసాయిపేటలో 23.8, చేగుంటలో 21.8, మెదక్‌లో 18.8, దామరంచలో 16.8, కొల్చారంలో 16.5, రామాయంపేటలో 15.8 మిమీల వర్షం మాత్రమే కురిసింది.

News August 20, 2025

MDK: ‘గ్రామాల్లో కొలవుదీరనున్న గణనాథులు’

image

భూలోకానికి వస్తున్న గణనాథులు నవరాత్రులు పూజలు అందుకొనున్నారు. ఈ మేరకు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఇప్పటికే గణపతి మండపాలను నిర్మాణం చేస్తున్నారు. ఆగస్టు 27 నుంచి వినాయక చవితి ఉన్నందున పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు చందాలు, మండప నిర్మాణాల పనుల్లో నిమగ్నమైపోయారు.

News August 20, 2025

పాపన్నపేట: ‘నడవలేనని’ కళలకు జీవం పోస్తూ ముందడుగు..

image

తాను నడవలేనని బాధపడలేదు.. కనుమరుగవుతున్న కళలకు జీవం పొసేందుకు ముందడుగు వేశాడు ఓ దివ్యాంగుడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రెండు పీజీలు చదివాడు. మెదక్ జిల్లా కుర్తివాడ గ్రామానికి చెందిన దేవయ్య.. గ్రామ, మండల విద్యార్థులకు జడకోప్పు, కోలాటం, యోగ్చాప్, చెక్కభజనలో శిక్షణ ఇస్తున్నాడు. వీటికి అవసరమయ్యే సామగ్రిని అతడే కొనుగోలు చేసి సమాజ సేవలో తన వంతుగా సామజిక బాధ్యత వహిస్తున్నారు .