News October 24, 2025

MDK: కర్నూలు బస్సు ప్రమాదంలో తల్లీకూతుళ్లు సజీవదహనం

image

HYD-బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్ బస్ కర్నూలు సమీపంలో అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే. అయితే ఈఘటనలో మెదక్‌(M)కు చెందిన తల్లీకూతుళ్లు సజీవ దహనమయ్యారు. మండలంలోని శివాయిపల్లికి చెందిన మంగ వేణు అలియాస్ ఆనంద్ దుబాయ్‌లో ఉంటున్నాడు. ఇటీవల స్వగ్రామానికి వచ్చి తిరిగెళ్లాడు. కుమార్తె మంగ చందన(23)ను బెంగళూరులో విడిచి దుబాయ్ వెళ్లేందుకు తల్లి సంధ్యారాణి(43) బస్సులో వెళ్తుండగా ప్రమాదంలో మరణించారు.

Similar News

News October 25, 2025

ADB: యూట్యూబ్‌లో యువతి పరిచయం.. రూ.8 లక్షల టోకరా

image

యూట్యూబ్లో పరిచయమై రూ.8 లక్షలకు యువతి టోకరా ఇచ్చిన ఘటన వెలుగు చూసింది. ఆదిలాబాద్‌లో బంగారు నగల పని చేసే వ్యక్తి 10 నెలల కిందట యూట్యూబ్ చూస్తుండగా ఒక నెంబరు రాగా.. HYD కు చెందిన కృష్ణవేణి పరిచయమైంది. అత్యవసరంగా డబ్బు అవసరముందంటూ విడతల వారీగా బాధితుని నుంచి రూ.8లక్షల వరకు ఆమె తీసుకుంది. యువతికి డబ్బుల అడగగా ఇవ్వను.. ఏం చేసుకుంటావో చేసుకో అని బెదిరించింది. దీంతో బాధితుడు వన్ టౌన్‌లో ఫిర్యాదు చేశాడు.

News October 25, 2025

ఎల్లో అలర్ట్.. ఈ జిల్లాల్లో వర్షాలు

image

TG: రాష్ట్రంలో 3రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, WGL, HNK, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, HYD, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, ఉమ్మడి MBNR జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

News October 25, 2025

కార్తిక మాసంలో ఏరోజు పవిత్రమైనది?

image

కార్తీక మాసంలో ప్రతి దినం భగవత్ చింతనకు శ్రేష్ఠమైనదే. అయితే కార్తీక సోమవారాలు శివుడికి ప్రీతికరమైనవి. ఈ రోజున ఉపవాసం, రుద్రాభిషేకం చేసేవారికి ఆయన అనుగ్రహం లభిస్తుంది. క్షీరాబ్ది ద్వాదశి నాడు తులసికోట, ఉసిరి చెట్టును పూజించడం శుభాలకు మూలం. కార్తీక పౌర్ణమి ఈ మాసానికి శిఖరాయమానం. ఈ రోజున చేసే నదీ స్నానం, దీపారాధన ద్వారా శివకేశవుల అనుగ్రహం లభించి, జన్మజన్మల పాపాలు హరిస్తాయని పురాణాలు చెబుతున్నాయి.