News September 12, 2025
MDK: గురు’కూలే’ భవనాలు

ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రభుత్వ గురుకులాలు వసతి గృహాల పరిస్థితి అధ్వానంగా తయారైనా అధికారులు పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. SRD జిల్లా లింగంపల్లి శివారులోని గురుకుల పాఠశాలలోని హాస్టల్ భవనం రెండు రోజుల కిందట కుప్పకూలింది. ఆ సమయంలో విద్యార్థులు అక్కడ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. SDPT లో మైనార్టీ గురుకుల పాఠశాల అధ్వానంగా ఉంది. MDK రామాయంపేట ఎస్సీ హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరుకుంది.
Similar News
News April 3, 2026
KU: సిఎల్ఐఎస్సి థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదల

కేయూలో ఏప్రిల్ 15 నుంచి 24 వరకు CLISC థియరీ పరీక్షలను మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నిర్వహించనుంది. మే 11న లైబ్రరీ క్లాసిఫికేషన్ ప్రాక్టికల్ పరీక్షలు ఉదయం, మధ్యాహ్నం రెండు బ్యాచ్లుగా జరుగుతాయి. ఈ పరీక్షలన్నీ వరంగల్లోని SDLCE కేంద్రంలోనే జరుగుతాయని అధికారులు వెల్లడించారు. మొత్తం ఐదు పేపర్లకు సంబంధించి లైబ్రరీ మేనేజ్మెంట్, సోర్సెస్, క్లాసిఫికేషన్, క్యాటలాగింగ్ అంశాలపై పరీక్షలుంటాయి.
News April 3, 2026
సిరిసిల్ల : ముగిసిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక గ్రామసభలు

ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా గురువారం ఆయా గ్రామాల సర్పంచ్ ల అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలపై చర్చించారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా, ఇంటర్ విద్యార్థులకు అల్పాహార పథకంపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించారు. వాటి పరిష్కారానికి నిర్ణయం తీసుకొని సమావేశాలను ముగించారు.
News April 3, 2026
BREAKING NEWS: పేర్ని కిట్టుపై కేసు నమోదు

మచిలీపట్నం నియోజకవర్గ YCP ఇన్ఛార్జ్<<19544536>> పేర్ని కిట్టుపై<<>> చిలకలపూడి PSలో కేసు నమోదైంది. గురువారం ఉదయం కొబ్బరితోటలో ఓ అక్రమ భవన నిర్మాణం జరుగుతున్న సమయంలో తన విధులకు ఆటంకం కల్పించడమే కాకుండా బెదిరించేలా మాట్లాడారని ఇనగుదురుపేట సీఐ పరమేశ్వరరావు ఫిర్యాదు చేశారు. సీఐ ఫిర్యాదు మేరకు పేర్ని కిట్టుపై BNS 132, 351(2) రెడ్ విత్ 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.


