News September 12, 2025
MDK: గురు’కూలే’ భవనాలు

ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రభుత్వ గురుకులాలు వసతి గృహాల పరిస్థితి అధ్వానంగా తయారైనా అధికారులు పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. SRD జిల్లా లింగంపల్లి శివారులోని గురుకుల పాఠశాలలోని హాస్టల్ భవనం రెండు రోజుల కిందట కుప్పకూలింది. ఆ సమయంలో విద్యార్థులు అక్కడ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. SDPT లో మైనార్టీ గురుకుల పాఠశాల అధ్వానంగా ఉంది. MDK రామాయంపేట ఎస్సీ హాస్టల్ భవనం శిథిలావస్థకు చేరుకుంది.
Similar News
News September 12, 2025
సికింద్రాబాద్: గాంధీలో సేవలు ఇకనైనా గాడిన పడేనా?

గాంధీ ఆస్పత్రి అంటేనే తెలుగు రాష్ట్రాల్లోని పేదలకు ఓ ధైర్యం.. అలాంటిది ఇటీవల ఇందులో సరైన సేవలందడం లేదని పలువురు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీనంతటికీ కారణం సూపరింటెండెంట్ డా.రాజకుమారి నిర్లక్ష్య వైఖరే కారణమని ఫిర్యాదులో పేర్కొన్నారు. స్పందించిన ప్రభుత్వం ఆమె స్థానంలో అడిషనల్ DME డా.వాణి నూతన సూపరింటెండెంట్ను నియమించింది. ఇప్పుడైనా సేవలు మెరుగుపడతాయేమోనని నగర వాసులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.
News September 12, 2025
13న నూతన కలెక్టర్ బాధ్యతల స్వీకరణ

తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా నియమితులైన కీర్తి చేకూరి సెప్టెంబర్ 13న మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించనున్నారు. 2016 ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ క్యాడర్కు చెందిన ఆమె గతంలో ఏపీ ట్రాన్స్కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసి ఇక్కడికి బదిలీ అయ్యారు. ఈ జిల్లాలో గతంలో జాయింట్ కలెక్టర్గా కూడా ఆమె పనిచేశారు. రానున్న పుష్కరాల నేపథ్యంలో కలెక్టర్గా ఆమె బాధ్యతలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారాయి.
News September 12, 2025
అన్నమయ్య జిల్లా నూతన కలెక్టర్గా నిశాంత్ కుమార్

అన్నమయ్య జిల్లా నూతన కలెక్టర్గా నిశాంత్ కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుత కలెక్టర్ చామకూరి శ్రీధర్ను బదిలీ చేశారు. కలెక్టర్ నిశాంత్ కుమార్ ఏపీ ఎక్సైజ్ శాఖ డైరెక్టర్గా పనిచేశారు. అన్నమయ్య జిల్లా కలెక్టర్గా శ్రీధర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జిల్లాను అభివృద్ధి పథంలో నడపడానికి తన వంతు కృషి చేశారు. అయితే ఈయనను ఎక్కడికి బదిలీ చేశారో తెలియాల్సి ఉంది.