News December 1, 2025

MDK: గుర్తుల పంచాయితీ!

image

పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులుండవు. సర్పంచ్‌కు గులాబీ రంగు, వార్డు సభ్యులకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లు కీలకం కానున్నాయి. సర్పంచ్ గుర్తుల్లో ఉంగరం, కత్తెర బాగానే ఉన్నా, బ్యాట్, టీవీ రిమోట్లు, సాసర్, పలక, బ్లాక్ బోర్డు వంటివి ఒకేలా ఉండటంతో ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. ప్రచారం సరిగా చేయకపోతే ఓట్లు మారే ప్రమాదం ఉంది.

Similar News

News March 6, 2026

ప్రారంభమైన మహా కుంభాభిషేక మహోత్సవాలు

image

ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో ద్వాదశ వార్షిక మహాకుంభాభిషేక మహోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలు వేదమంత్రోచ్ఛారణల మధ్య ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఉదయం కనకదుర్గానగర్ ప్రవేశద్వారం నుంచి పవిత్ర కలశాలతో అర్చకులు, వేదపండితులు ఇంద్రకీలాద్రికి చేరుకునే కలశ ఊరేగింపు నిర్వహించారు. అనంతరం యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యాహవాచనం నిర్వహించారు.

News March 6, 2026

HYDలోని మరో ఆఫీస్‌కు బాంబు బెదిరింపు

image

బేగంపేట వాతావరణ శాఖ కార్యాలయానికి బాంబు బెదిరింపు రావడం కలకలం రేపింది. 14 బాంబులు అమర్చామని, మధ్యాహ్నం వరకు అవి పేలుతాయని ఈమెయిల్ ద్వారా దుండగులు బెదిరింపులకు పాల్పడ్డారు. వెంటనే అప్రమత్తమైన బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది కార్యాలయాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రధాన భవనం సురక్షితమని అధికారులు తేల్చారు. ఇటీవల వరుసగా కోర్టులకు సైతం బెదిరింపు మెయిల్స్ వచ్చిన విషయం తెలిసిందే.

News March 6, 2026

కామారెడ్డి: ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షకు 97.92 శాతం హాజరు

image

కామారెడ్డి జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు 97.92 శాతం హాజరు నమోదైనట్లు నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 6,585 మంది విద్యార్థులకు గాను 6,448 మంది హాజరయ్యారని, 137 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాల వద్ద అన్ని వసతులు కల్పించినట్లు ఆయన వివరించారు.