News December 23, 2025
MDK: నాలుగు పర్యాయాలు ఒకే కుటుంబం సర్పంచ్

మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేటకు చెందిన ఒకే కుటుంబం 4 పర్యాయాలుగా సర్పంచ్ పదవికి ఎన్నికయ్యారు. 2025లో జరిగిన ఎన్నికల్లో శివగోని పెంటా గౌడ్ సర్పంచిగా గెలుపొందారు. 2006లో పెంట గౌడ్ తమ్ముడు రాజాగౌడ్, ఆ తర్వాత జరిగిన 2012, 2018లో జరిగిన ఎన్నికల్లో పెంటాగౌడ్ తల్లి సుగుణమ్మ రెండు పర్యాయాలు సర్పంచ్ పనిచేశారు. రాజాగౌడ్ భార్య ఎంపీటీసీగా సేవలందించారు.
Similar News
News December 24, 2025
మెదక్: చర్చి వద్ద 496 మందితో భారీ బందోబస్త్: ఎస్పీ

క్రిస్మస్ సందర్బంగా ప్రఖ్యాత మెదక్ చర్చ్ వద్ద భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావు ప్రత్యక్ష పర్యవేక్షణలో 496 మందితో బందోబస్త్ కల్పించనున్నారు. డీఎస్పీలు-4, సీఐలు-12, ఎస్ఐలు-47, ఏఎస్ఐలు-31, HC/WHC-46, PC/WPC-185, HG/WHG-87, 3QRT-51, 3 రూప్ పార్టీస్ 33 మంది సిబ్బందితో చర్చి వద్ద బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నారు. చర్చి ముందు కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తారు.
News December 24, 2025
మెదక్: కరాటే మాస్టర్లు దరఖాస్తు చేసుకోవాలి: డీఈఓ

మెదక్ జిల్లాలోని మొత్తం 162 పాఠశాలలో బాలికల కోసం రాణి లక్ష్మిభాయి ఆత్మరక్ష ప్రశిక్షణ్ స్వీయరక్షణ (కరాటే) కార్యక్రమంలో భాగంగా మూడు నెలల (డిసెంబర్-2025 నుంచి మార్చి-2026) మధ్య శిక్షణ కోసం అభ్యర్థులు (కరాటే మాస్టర్) దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ విజయ తెలిపారు. అర్హతలుగల అభ్యర్థులు మెదక్ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఈనెల 29న సాయంత్రం 5 గం.లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News December 24, 2025
మెదక్: కరాటే మాస్టర్లు దరఖాస్తు చేసుకోవాలి: డీఈఓ

మెదక్ జిల్లాలోని మొత్తం 162 పాఠశాలలో బాలికల కోసం రాణి లక్ష్మిభాయి ఆత్మరక్ష ప్రశిక్షణ్ స్వీయరక్షణ (కరాటే) కార్యక్రమంలో భాగంగా మూడు నెలల (డిసెంబర్-2025 నుంచి మార్చి-2026) మధ్య శిక్షణ కోసం అభ్యర్థులు (కరాటే మాస్టర్) దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ విజయ తెలిపారు. అర్హతలుగల అభ్యర్థులు మెదక్ జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఈనెల 29న సాయంత్రం 5 గం.లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


