News January 27, 2025
MDK: ప్రత్యేక అధికారిగా అడిషనల్ కలెక్టర్ నగేష్

మెదక్ జిల్లాలో గల నాలుగు మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారిగా అడిషనల్ కలెక్టర్ నగేష్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. నేటితో మున్సిపాలిటీల పదవీ కాలం ముగుస్తుంది. సకాలంలో ఎన్నికలు నిర్వహించలేకపోవడంతో ప్రత్యేక అధికారులను నియమించారు. మెదక్తో పాటు నర్సాపూర్, తుప్రాన్, రామాయంపేట మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారిగా అడిషనల్ కలెక్టర్ నగేష్ (లోకల్ బాడి)ను నియమించారు.
Similar News
News April 25, 2025
మెదక్: కొడుకుల చేతులు కోసి, తల్లి సూసైడ్

అత్తింటి వేధింపులు భరించలేక కొడుకులతో తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసుల వివరాలు.. గుమ్మడిదలకు చెందిన అహ్మద్, మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన రేష్మాబేగం(30)ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు. అదనపు కట్నం కోసం అత్తింటివారు వేధిస్తున్నారు. తట్టుకోలేక కుమారుల చేతులపై కత్తితో గాయాలు చేసి, ఆమె ఉరేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు పిల్లలను అసుపత్రికి తరలించారు.
News April 25, 2025
నర్సాపూర్: రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.. ఒకరి మృతి

నర్సాపూర్ మండలం రుస్తుంపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం రాత్రి స్థానిక పెట్రోల్ బంక్ సమీపంలో ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
News April 25, 2025
మెదక్: సైబర్ మోసగాళ్ల వలలో చిక్కిన యువతి

సైబర్ మోసగాళ్ల వలలో పడి యువతి డబ్బులు పోగొట్టుకున్న ఘటన మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి రూ.1000 చెల్లిస్తే రూ.600 కమిషన్ వస్తుందని ఆమెను నమ్మించాడు. విడతల వారీగా రూ.1.28 లక్షలు చెల్లించిన యువతి తాను మోసపోయినట్టు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.