News August 24, 2025
MDK: మద్యం టెండర్లు.. వస్తే ఆ కిక్కే వేరు!

ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని ఖరారు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేయడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వ్యాపారుల్లో కదలిక మొదలైంది. ప్రస్తుతం మద్యం షాపులు నడుపుతున్న యజమానులు, గతంలో టెండర్ వేసి షాపులు దొరకని వారు ఇప్పటి నుంచే గ్రూపులు, సిండికేట్లుగా ఏర్పడి టెండర్లలో పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు. SDPT-93, MDK-49, SRD-101 కలిపి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 243 వైన్ షాపులు ఉన్నాయి. మద్యం పాలసీపై మీ కామెంట్.
Similar News
News August 24, 2025
HYD: ‘సహస్ర చెల్లి లాంటిది.. తప్పు చేయలేదు: వెంకట్

కూకట్పల్లిలో సహస్ర హత్య కేసులో పోలీసులు జరిపిన అంతర్గత విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో నిందితుడు వెంకట్ వివిధ కారణాలతో డిప్రెషన్కు గురైనట్లు గుర్తించారు. బ్యాట్ను దొంగలిస్తుండగా చూసి తల్లిదండ్రులకు చెబుతానని సహస్ర అనడంతో భయమేసి కత్తితో పొడిచానని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. సహస్ర చెల్లి లాంటిదని, ఎలాంటి తప్పు చేయలేదంటూ బదులిచ్చినట్లు సమాచారం.
News August 24, 2025
వత్సవాయి: రాఖీ కట్టే విషయంలో వివాదం.. మహిళ సూసైడ్

సోదరులకు రాఖీ కట్టే విషయంలో చోటుచేసుకున్న వివాదం ఒక మహిళ జీవితాన్ని బలిగొంది. వత్సవాయికి చెందిన రేష్మ మక్కపేటలో నివసిస్తున్న తన సోదరులకు రాఖీ కట్టడానికి వెళ్లేందుకు సిద్ధమైంది. అయితే, ఈ విషయంలో ఆమెకు భర్తతో గొడవ జరిగింది. ఈ గొడవతో క్షణికావేశంలో రేష్మ ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. సమాజంలో ఇలాంటి ఆత్మహత్యలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
News August 24, 2025
ASF: మునుగోళ్లతో మొక్కులు చెల్లించిన ఆదివాసులు

పెంచికలపేట్ మండలం జిల్లెడ గ్రామంలో ఆదివాసులు సాంప్రదాయంగా మునుగోళ్లపై వెళ్లి బొడగ మొక్కులు చెల్లించుకున్నారు. శ్రావణమాసం ప్రారంభంలో వెదురు బొంగులతో తయారు చేసిన మునుగోళ్లపై నడుస్తూ ఉంటారు. అమావాస్య మరుసటి రోజున బొడగ పండగలో భాగంగా మునుగోళ్లతో ఊరి పొలిమేరలోని ఇప్పచెట్టు వద్దకు వెళ్తారు. నైవేద్యాలు సమర్పించి వాటిని అక్కడ వదిలేస్తారు.